Skip to main content

బీజేపీ తీరు ఎన్నో ప్రశ్నలకు తావిస్తోంది: కశ్మీర్ లో ఈయూ ప్రతినిధుల పర్యటనపై శివసేన విమర్శలు



జమ్మూకశ్మీర్ లో యూరోపియన్ సమాఖ్య (ఈయూ) ఎంపీల పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై శివసేన పార్టీ విమర్శలు గుప్పించింది. 'ఈయూకి చెందిన ఎంపీలు కశ్మీర్ లోని పరిస్థితులను తెలుసుకోవడానికి ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. దేశంలో కశ్మీర్ అంతర్భాగం. ఆ ప్రాంతంలో జాతీయ జెండా ఎగిరింది.. ఇందుకోసం ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా చేసిన కృషి పట్ల గర్విస్తున్నాం. అయితే, కశ్మీర్ లో పరిస్థితులన్నీ సరిగ్గానే ఉంటే విదేశీ ప్రతినిధులను ఆ ప్రాంతానికి ఎందుకు పంపారు? కశ్మీర్ మన దేశంలో అంతర్భాగం కాదా?' అని శివసేన తమ పత్రిక సామ్నాలో విమర్శలు గుప్పించింది.

'ఆ ప్రాంతం విషయంలో ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోకూడదని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కానీ, కశ్మీర్ కు విదేశీ ప్రతినిధులను పంపుతోంది. ఇలా విదేశీయులు కశ్మీర్ లో పరిస్థితులను గుర్తించడానికి వస్తే దేశంలోని స్వేచ్ఛపై దాడి చేసినట్లే. ఈ చర్య ఎన్నో ప్రశ్నలకు తావిస్తోంది. భారత ఎంపీలు ఆ ప్రాంతంలో పర్యటించడానికి అనుమతి ఇవ్వని కేంద్ర ప్రభుత్వం.. విదేశీ ప్రతినిధులను మాత్రం ఎందుకు స్వాగతించింది? ఈ ప్రశ్నకు హోం మంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలి. వారిని ఈ పర్యటనకు అనుమతించి ప్రతిపక్షాలు దీనిపై ప్రశ్నలు లేవనెత్తే అవకాశాన్ని బీజేపీయే ఇచ్చింది' అని విమర్శలు గుప్పించింది. 

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.