Skip to main content

బీజేపీ తీరు ఎన్నో ప్రశ్నలకు తావిస్తోంది: కశ్మీర్ లో ఈయూ ప్రతినిధుల పర్యటనపై శివసేన విమర్శలు



జమ్మూకశ్మీర్ లో యూరోపియన్ సమాఖ్య (ఈయూ) ఎంపీల పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై శివసేన పార్టీ విమర్శలు గుప్పించింది. 'ఈయూకి చెందిన ఎంపీలు కశ్మీర్ లోని పరిస్థితులను తెలుసుకోవడానికి ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. దేశంలో కశ్మీర్ అంతర్భాగం. ఆ ప్రాంతంలో జాతీయ జెండా ఎగిరింది.. ఇందుకోసం ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా చేసిన కృషి పట్ల గర్విస్తున్నాం. అయితే, కశ్మీర్ లో పరిస్థితులన్నీ సరిగ్గానే ఉంటే విదేశీ ప్రతినిధులను ఆ ప్రాంతానికి ఎందుకు పంపారు? కశ్మీర్ మన దేశంలో అంతర్భాగం కాదా?' అని శివసేన తమ పత్రిక సామ్నాలో విమర్శలు గుప్పించింది.

'ఆ ప్రాంతం విషయంలో ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోకూడదని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కానీ, కశ్మీర్ కు విదేశీ ప్రతినిధులను పంపుతోంది. ఇలా విదేశీయులు కశ్మీర్ లో పరిస్థితులను గుర్తించడానికి వస్తే దేశంలోని స్వేచ్ఛపై దాడి చేసినట్లే. ఈ చర్య ఎన్నో ప్రశ్నలకు తావిస్తోంది. భారత ఎంపీలు ఆ ప్రాంతంలో పర్యటించడానికి అనుమతి ఇవ్వని కేంద్ర ప్రభుత్వం.. విదేశీ ప్రతినిధులను మాత్రం ఎందుకు స్వాగతించింది? ఈ ప్రశ్నకు హోం మంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలి. వారిని ఈ పర్యటనకు అనుమతించి ప్రతిపక్షాలు దీనిపై ప్రశ్నలు లేవనెత్తే అవకాశాన్ని బీజేపీయే ఇచ్చింది' అని విమర్శలు గుప్పించింది. 

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...