Skip to main content

బీజేపీ తీరు ఎన్నో ప్రశ్నలకు తావిస్తోంది: కశ్మీర్ లో ఈయూ ప్రతినిధుల పర్యటనపై శివసేన విమర్శలు



జమ్మూకశ్మీర్ లో యూరోపియన్ సమాఖ్య (ఈయూ) ఎంపీల పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై శివసేన పార్టీ విమర్శలు గుప్పించింది. 'ఈయూకి చెందిన ఎంపీలు కశ్మీర్ లోని పరిస్థితులను తెలుసుకోవడానికి ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. దేశంలో కశ్మీర్ అంతర్భాగం. ఆ ప్రాంతంలో జాతీయ జెండా ఎగిరింది.. ఇందుకోసం ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా చేసిన కృషి పట్ల గర్విస్తున్నాం. అయితే, కశ్మీర్ లో పరిస్థితులన్నీ సరిగ్గానే ఉంటే విదేశీ ప్రతినిధులను ఆ ప్రాంతానికి ఎందుకు పంపారు? కశ్మీర్ మన దేశంలో అంతర్భాగం కాదా?' అని శివసేన తమ పత్రిక సామ్నాలో విమర్శలు గుప్పించింది.

'ఆ ప్రాంతం విషయంలో ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోకూడదని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కానీ, కశ్మీర్ కు విదేశీ ప్రతినిధులను పంపుతోంది. ఇలా విదేశీయులు కశ్మీర్ లో పరిస్థితులను గుర్తించడానికి వస్తే దేశంలోని స్వేచ్ఛపై దాడి చేసినట్లే. ఈ చర్య ఎన్నో ప్రశ్నలకు తావిస్తోంది. భారత ఎంపీలు ఆ ప్రాంతంలో పర్యటించడానికి అనుమతి ఇవ్వని కేంద్ర ప్రభుత్వం.. విదేశీ ప్రతినిధులను మాత్రం ఎందుకు స్వాగతించింది? ఈ ప్రశ్నకు హోం మంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలి. వారిని ఈ పర్యటనకు అనుమతించి ప్రతిపక్షాలు దీనిపై ప్రశ్నలు లేవనెత్తే అవకాశాన్ని బీజేపీయే ఇచ్చింది' అని విమర్శలు గుప్పించింది. 

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...

కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమే.. యుద్ధం వస్తే మేం సిద్ధం : ఇమ్రాన్‌

జమ్ముకశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు 74వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఐరాస వేదికగా కవ్వింపు ప్రకటన చేశారు. కశ్మీర్‌ను కేవలం రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.   ప్రపంచం ఏం చేసింది?.   బాలాకోట్‌లో 500 మంది తీవ్రవాదులు రెడీగా ఉన్నారని ఇండియా రక్షణ మంత్రి చెబుతున్నారు. 500 మంది తీవ్రవాదులను పంపి మేమేం సాధిస్తాం?. 500 మంది తీవ్రవాదులను పంపాల్సిన అవసరం మాకేంటి.?. ఇస్లామిక్ టెర్రరిజం అంటూ ఇండియా మాపై ముద్ర వేస్తుంది. కశ్మీరీల హక్కులు ఎవరికీ పట్టవు. కశ్మీర్‌లో అనుసరిస్తున్న విధానాలు భారత్‌లో ఉన్న ముస్లింలపై ఎలా ప్రభావం చూపుతాయో మోదీ ఆలోచించారా?. 10 లక్షల మంది రోహింగ్యాలను బర్మా నుంచి గెంటేస్తే ప్రపంచం ఏం చేసింది?. ఇలాంటి పరిణామాలే ఇస్లాం సమాజంలో ఆవేదన, అసంతృప్తిని రేపుతున్నాయి ’  అని ఇమ్రాన్ ఆగ్రహ వ్యక్తం చేశారు. యుద్ధం వస్తే మేం సిద్ధం! ‘ ఇప్పుడు చాలా సంక్లిష్టం సమయం నడుస్తోంది. అణ్వాయుధాలున్న రెండు దేశాలు తలపడాల్స...