Skip to main content

మన హెలికాప్టర్ ను మన క్షిపణే బలిగొంది!... అసలు విషయాన్ని బయటపెట్టిన వాయుసేన చీఫ్

పుల్వామా దాడులకు ప్రతీకారంగా పీవోకేలోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ భీకర వైమానిక దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో జమ్మూకశ్మీర్ లోని బద్దాం ప్రాంతంలో ఎంఐ-17 వీ5 హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వాయుసేన సిబ్బంది, ఓ సాధారణ పౌరుడు మృతి చెందారు. అయితే ఈ హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కూలిపోయిందని, పాక్ క్షిపణి దాడిలో కుప్పకూలిందని భిన్న వాదనలు వినిపించాయి. కానీ, ఇటీవలే కొత్తగా వాయుసేన ఎయిర్ చీఫ్ మార్షల్ గా బాధ్యతలు స్వీకరించిన ఆర్కే భదౌరియా అసలు విషయాన్ని వెల్లడించారు.

ఆ వేళ బద్గాంలో క్షిపణి ప్రయోగాలు నిర్వహిస్తున్నారని, అయితే ఎంఐ-17 హెలికాప్టర్ ను పాక్ కు చెందినదిగా భావించి పొరబాటున క్షిపణిని దానిపైకి సంధించారని భదౌరియా వివరించారు. ఈ దుర్ఘటనకు కారకులైన అధికారులపై న్యాయపరమైన విచారణ పూర్తిచేశామని, వారిపై కఠినచర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. మున్ముందు ఇలాంటి ఘోరతప్పిదాలు జరగకుండా జాగ్రత్త పడతామని తెలిపారు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...