Skip to main content

మళ్లీ తెరపైకి పవన్ 'సత్యాగ్రహి' టాపిక్



రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయిస్తానంటూ సినిమాలను దూరంపెట్టిన పవన్ కల్యాణ్, ఎన్నికల ఫలితాల తరువాత తన నిర్ణయాన్ని మార్చుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది. గతంలో కొంతమంది నిర్మాతల నుంచి అడ్వాన్సులు తీసుకున్న ఆయన, ఇప్పుడు ఆ ప్రాజెక్టులను చేసే ఆలోచనలో ఉన్నాడని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే 'సత్యాగ్రహి' సినిమా టాపిక్ మళ్లీ తెరపైకి వచ్చింది.

పవన్ కల్యాణ్ హీరోగా సూర్య మూవీస్ బ్యానర్ పై 2006లో 'సత్యాగ్రహి' సినిమా సెట్స్ పైకి వెళ్లింది. కొన్ని రోజుల షూటింగ్ అనంతరం కొన్ని కారణాల వలన ఆగిపోయింది. సామాజిక సమస్యలపై ఓ యువకుడి పోరాటంగా సాగే ఆ కథ అప్పట్లో పవన్ కి బాగా నచ్చిందట. అందువలన ప్రస్తుత పరిస్థితుల్లో తన రాజకీయ జీవితానికి ఆ కథ హెల్ప్ అవుతుందని భావించిన పవన్, క్రిష్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించే పనిలో వున్నాడని చెప్పుకుంటున్నారు. ఎ.ఎమ్.రత్నం ఇచ్చిన అడ్వాన్స్ పవన్ దగ్గరే ఉండటం వలన, ఆయన నిర్మాణంలోనే ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...