Skip to main content

మళ్లీ తెరపైకి పవన్ 'సత్యాగ్రహి' టాపిక్



రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయిస్తానంటూ సినిమాలను దూరంపెట్టిన పవన్ కల్యాణ్, ఎన్నికల ఫలితాల తరువాత తన నిర్ణయాన్ని మార్చుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది. గతంలో కొంతమంది నిర్మాతల నుంచి అడ్వాన్సులు తీసుకున్న ఆయన, ఇప్పుడు ఆ ప్రాజెక్టులను చేసే ఆలోచనలో ఉన్నాడని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే 'సత్యాగ్రహి' సినిమా టాపిక్ మళ్లీ తెరపైకి వచ్చింది.

పవన్ కల్యాణ్ హీరోగా సూర్య మూవీస్ బ్యానర్ పై 2006లో 'సత్యాగ్రహి' సినిమా సెట్స్ పైకి వెళ్లింది. కొన్ని రోజుల షూటింగ్ అనంతరం కొన్ని కారణాల వలన ఆగిపోయింది. సామాజిక సమస్యలపై ఓ యువకుడి పోరాటంగా సాగే ఆ కథ అప్పట్లో పవన్ కి బాగా నచ్చిందట. అందువలన ప్రస్తుత పరిస్థితుల్లో తన రాజకీయ జీవితానికి ఆ కథ హెల్ప్ అవుతుందని భావించిన పవన్, క్రిష్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించే పనిలో వున్నాడని చెప్పుకుంటున్నారు. ఎ.ఎమ్.రత్నం ఇచ్చిన అడ్వాన్స్ పవన్ దగ్గరే ఉండటం వలన, ఆయన నిర్మాణంలోనే ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.