Skip to main content

జగనే అరెస్ట్ చేయించారు... మా నేతంటే అంతే...: బెయిల్ పై బయటకు వచ్చిన తరువాత కోటంరెడ్డి!

కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి బెయిల్ మంజూరు
చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నది తమ అధినేత వైఎస్ జగన్ నమ్మకమని, ఆ నమ్మకమే తనను అరెస్ట్ చేయించిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎంపీడీఓ సరళ పెట్టిన కేసులో ఈ తెల్లవారుజామున కోటంరెడ్డిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లిన అధికారులు, ఆపై ఆయన్ను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా, బెయిల్ మంజూరైంది.

అనంతరం మీడియాతో మాట్లాడిన కోటంరెడ్డి, ఆధారాలుంటే, తమ పార్టీ నాయకుడైనా కచ్చితంగా చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారని, అటువంటి వ్యక్తి కలకాలం పాటు రాష్ట్రానికి సీఎంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని, అయినా విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని తెలిపారు.

ఈ కేసులో పూర్తి విచారణ జరిపించాలని పోలీసులను కోరుకుంటున్నానని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తన దురదృష్టం కూడా ఉందని, జిల్లా ఎస్పీకి, తనకు విభేదాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందేనని, డీజీపీ నుంచి ఆదేశాలు రాగానే ఆయన ఏ మాత్రమూ విచారించకుండా తనను అరెస్ట్ చేయించారని కోటంరెడ్డి ఆరోపించారు. ఎన్నికలకు ముందు కూడా ఆయన తనను అదే విధంగా ఇబ్బంది పెట్టారని అన్నారు. ఎన్నికల తరువాత కూడా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.

నాలుగు రోజుల క్రితమే ఈ విషయమై కలెక్టర్ కు తాను ఫిర్యాదు చేశానని చెప్పిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తమ అధినేత నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఆధారాలుంటే చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తే, ఆదేశాలు వచ్చిన గంటలోపే తనను అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఓ శాసన సభ్యుడనైన తాను ఎక్కడకు పారిపోతానని అంత హడావుడిగా అరెస్ట్ చూపించాల్సి వచ్చిందని మండిపడ్డారు. తనకు ఫోన్ చేసి పిలిచినా స్టేషన్ కు వెళ్లేవాడినని, అరెస్ట్ చేస్తామని చెబితే లొంగిపోయి ఉండేవాడినని అన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన స్వేచ్ఛను నెల్లూరు పోలీసులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...