Skip to main content

జగనే అరెస్ట్ చేయించారు... మా నేతంటే అంతే...: బెయిల్ పై బయటకు వచ్చిన తరువాత కోటంరెడ్డి!

కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి బెయిల్ మంజూరు
చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నది తమ అధినేత వైఎస్ జగన్ నమ్మకమని, ఆ నమ్మకమే తనను అరెస్ట్ చేయించిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎంపీడీఓ సరళ పెట్టిన కేసులో ఈ తెల్లవారుజామున కోటంరెడ్డిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లిన అధికారులు, ఆపై ఆయన్ను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా, బెయిల్ మంజూరైంది.

అనంతరం మీడియాతో మాట్లాడిన కోటంరెడ్డి, ఆధారాలుంటే, తమ పార్టీ నాయకుడైనా కచ్చితంగా చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారని, అటువంటి వ్యక్తి కలకాలం పాటు రాష్ట్రానికి సీఎంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని, అయినా విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని తెలిపారు.

ఈ కేసులో పూర్తి విచారణ జరిపించాలని పోలీసులను కోరుకుంటున్నానని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తన దురదృష్టం కూడా ఉందని, జిల్లా ఎస్పీకి, తనకు విభేదాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందేనని, డీజీపీ నుంచి ఆదేశాలు రాగానే ఆయన ఏ మాత్రమూ విచారించకుండా తనను అరెస్ట్ చేయించారని కోటంరెడ్డి ఆరోపించారు. ఎన్నికలకు ముందు కూడా ఆయన తనను అదే విధంగా ఇబ్బంది పెట్టారని అన్నారు. ఎన్నికల తరువాత కూడా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.

నాలుగు రోజుల క్రితమే ఈ విషయమై కలెక్టర్ కు తాను ఫిర్యాదు చేశానని చెప్పిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తమ అధినేత నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఆధారాలుంటే చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తే, ఆదేశాలు వచ్చిన గంటలోపే తనను అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఓ శాసన సభ్యుడనైన తాను ఎక్కడకు పారిపోతానని అంత హడావుడిగా అరెస్ట్ చూపించాల్సి వచ్చిందని మండిపడ్డారు. తనకు ఫోన్ చేసి పిలిచినా స్టేషన్ కు వెళ్లేవాడినని, అరెస్ట్ చేస్తామని చెబితే లొంగిపోయి ఉండేవాడినని అన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన స్వేచ్ఛను నెల్లూరు పోలీసులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...