Skip to main content

పీవీపీని బెదిరించిన కేసులో సినీ నిర్మాత బండ్ల గణేశ్ అరెస్టు!

 

ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్ ను పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ నేత, నిర్మాత పీవీపీని తన అనుచరులతో కలిసి బెదిరించిన కేసులో బండ్ల గణేశ్ ను హైదరాబాద్, బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ నిమిత్తం ఆయన్ని పిలిచిన పోలీసులు స్టేట్ మెంట్ రికార్డు చేశారు.

అదే సమయంలో, గతంలో ఆయనపై నమోదైన కేసుల విషయంలో కూడా పోలీసులు విచారించినట్టు సమాచారం. ఆయనపై 420, 448 తదితర ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, టెంపర్ సినిమా కోసం బండ్ల గణేశ్ కు పీవీపీ రూ.30 కోట్లు ఫైనాన్స్ చేసినట్టు, తీసుకున్న డబ్బులో రూ.7 కోట్లు తిరిగి చెల్లించనట్టు ఆరోపణలున్నాయి. ఈ విషయమై వారి మధ్య విభేదాలు తలెత్తాయి.   

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...