Skip to main content

భారత్ కు మద్దతు పలికే దేశాలపై కూడా క్షిపణి దాడులు చేస్తాం: పాకిస్థాన్ మంత్రి

 


జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ ల మధ్య వైరం మరింత ముదిరింది. ఇండియా ప్రతిష్టను దెబ్బతీసేందుకు అంతర్జాతీయ వేదికలపై తీవ్ర ప్రయత్నాలు చేసి విఫలమైన పాకిస్థాన్... మన దేశంపై సమరనాదాన్ని పూరిస్తోంది.

తాజాగా పాకిస్థాన్ కు చెందిన కశ్మీర్, గిల్గిత్ బాల్టిస్థాన్ వ్యవహారాల శాఖ మంత్రి అలీ అమీన్ సంచలన ప్రకటన చేశారు. కశ్మీర్ విషయంలో భారత్ తన వైఖరిని మార్చుకోకపోతే యూద్ధం తప్పదని ఆయన హెచ్చరించారు. అంతేకాదు, భారత్ కు మద్దతు పలికే దేశాలపై కూడా క్షిపణి దాడులు చేస్తామని వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్ లో యూరోపియన్ యూనియన్ కు చెందిన ఎంపీలు పర్యటిస్తున్న సమయంలో అమీన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

మరోవైపు, అమీన్ చేసిన వ్యాఖ్యలను పలువురు ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పాకిస్థాన్ మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...