Skip to main content

భారత్ కు మద్దతు పలికే దేశాలపై కూడా క్షిపణి దాడులు చేస్తాం: పాకిస్థాన్ మంత్రి

 


జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ ల మధ్య వైరం మరింత ముదిరింది. ఇండియా ప్రతిష్టను దెబ్బతీసేందుకు అంతర్జాతీయ వేదికలపై తీవ్ర ప్రయత్నాలు చేసి విఫలమైన పాకిస్థాన్... మన దేశంపై సమరనాదాన్ని పూరిస్తోంది.

తాజాగా పాకిస్థాన్ కు చెందిన కశ్మీర్, గిల్గిత్ బాల్టిస్థాన్ వ్యవహారాల శాఖ మంత్రి అలీ అమీన్ సంచలన ప్రకటన చేశారు. కశ్మీర్ విషయంలో భారత్ తన వైఖరిని మార్చుకోకపోతే యూద్ధం తప్పదని ఆయన హెచ్చరించారు. అంతేకాదు, భారత్ కు మద్దతు పలికే దేశాలపై కూడా క్షిపణి దాడులు చేస్తామని వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్ లో యూరోపియన్ యూనియన్ కు చెందిన ఎంపీలు పర్యటిస్తున్న సమయంలో అమీన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

మరోవైపు, అమీన్ చేసిన వ్యాఖ్యలను పలువురు ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పాకిస్థాన్ మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...