Skip to main content

సమంత, మంచు లక్ష్మిలపై యాంకర్ శ్వేతా రెడ్డి షాకింగ్ కామెంట్స్!


 



తన వివాదాస్పద కామెంట్లతో వార్తల్లో నిలిచే టీవీ యాంకర్ శ్వేతా రెడ్డి, ఉమెన్ సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల షీ టీమ్స్ ఏర్పడి 5 సంవత్సరాలు గడిచిన సందర్భంగా సమంత అక్కినేని, మంచు లక్ష్మి, పీవీ సింధులు శుభాకాంక్షలు చెబుతూ, సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టిన సంగతి తెలిసిందే. వీటినే ప్రస్తావించిన శ్వేతారెడ్డి, వీరు ముగ్గురూ తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందినవారేనని వ్యాఖ్యానించారు.

సమంత రాష్ట్రానికి చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారని, కేటీఆర్ నుంచి ఆమెకు అవకాశాలు వచ్చాయని ఆరోపించారు. మంచు లక్ష్మి ఫ్యాషన్ షోలు, సినిమాలు తదితరాలకు ప్రభుత్వం నుంచి కొద్దో గొప్పో ప్రయోజనాలను పొందారని, పీవీ సింధు ప్రభుత్వం నుంచి ఎకరాలకు ఎకరాల భూమిని తీసుకుందని ఆరోపించారు.

ఈ ముగ్గురు మహిళామణులు ఇక బంగారు తెలంగాణలో సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా ఫీల్ కాకుండా ఏడ్చే పరిస్థితి ఎక్కడుందని అడిగారు. వీరు ముగ్గురూ తప్ప రాజకీయ నాయకులుగానీ, జర్నలిస్టులు గానీ, పోలీసుల్లోని మహిళలుగానీ షీ టీమ్స్ గురించి స్పందించలేదని శ్వేతా రెడ్డి అన్నారు.

బిగ్ బాస్ షో గురించి తనతో సహా ఎంతో మంది ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించిన శ్వేతా రెడ్డి, అక్కడ అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేస్తూ, పోలీసు స్టేషన్ల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా షీ డీసీపీలు, షీ సిట్ ఆఫీసర్లు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.

పబ్బులు, క్లబ్బులు తిరుగుతూ, శని, ఆదివారాలు తప్పతాగి, రోడ్లపై న్యూసెన్స్ చేస్తూ సమంత, మంచు లక్ష్మి డ్రంకెన్ డ్రైవ్ లో దొరికిపోయినా, కేసులు పెట్టకుండా వదిలేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ షీ టీమ్స్ సమంత, లక్ష్మి, పీవీ సింధులకు మాత్రమే రక్షణగా ఉన్నారని, అత్యాచారాలను, మహిళలపై వేధింపులను పట్టించుకోవడం లేదని అన్నారు. శ్వేతా రెడ్డి వ్యాఖ్యల వీడియో వైరల్ అవుతోంది.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.