Skip to main content

సమంత, మంచు లక్ష్మిలపై యాంకర్ శ్వేతా రెడ్డి షాకింగ్ కామెంట్స్!


 



తన వివాదాస్పద కామెంట్లతో వార్తల్లో నిలిచే టీవీ యాంకర్ శ్వేతా రెడ్డి, ఉమెన్ సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల షీ టీమ్స్ ఏర్పడి 5 సంవత్సరాలు గడిచిన సందర్భంగా సమంత అక్కినేని, మంచు లక్ష్మి, పీవీ సింధులు శుభాకాంక్షలు చెబుతూ, సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టిన సంగతి తెలిసిందే. వీటినే ప్రస్తావించిన శ్వేతారెడ్డి, వీరు ముగ్గురూ తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందినవారేనని వ్యాఖ్యానించారు.

సమంత రాష్ట్రానికి చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారని, కేటీఆర్ నుంచి ఆమెకు అవకాశాలు వచ్చాయని ఆరోపించారు. మంచు లక్ష్మి ఫ్యాషన్ షోలు, సినిమాలు తదితరాలకు ప్రభుత్వం నుంచి కొద్దో గొప్పో ప్రయోజనాలను పొందారని, పీవీ సింధు ప్రభుత్వం నుంచి ఎకరాలకు ఎకరాల భూమిని తీసుకుందని ఆరోపించారు.

ఈ ముగ్గురు మహిళామణులు ఇక బంగారు తెలంగాణలో సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా ఫీల్ కాకుండా ఏడ్చే పరిస్థితి ఎక్కడుందని అడిగారు. వీరు ముగ్గురూ తప్ప రాజకీయ నాయకులుగానీ, జర్నలిస్టులు గానీ, పోలీసుల్లోని మహిళలుగానీ షీ టీమ్స్ గురించి స్పందించలేదని శ్వేతా రెడ్డి అన్నారు.

బిగ్ బాస్ షో గురించి తనతో సహా ఎంతో మంది ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించిన శ్వేతా రెడ్డి, అక్కడ అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేస్తూ, పోలీసు స్టేషన్ల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా షీ డీసీపీలు, షీ సిట్ ఆఫీసర్లు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.

పబ్బులు, క్లబ్బులు తిరుగుతూ, శని, ఆదివారాలు తప్పతాగి, రోడ్లపై న్యూసెన్స్ చేస్తూ సమంత, మంచు లక్ష్మి డ్రంకెన్ డ్రైవ్ లో దొరికిపోయినా, కేసులు పెట్టకుండా వదిలేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ షీ టీమ్స్ సమంత, లక్ష్మి, పీవీ సింధులకు మాత్రమే రక్షణగా ఉన్నారని, అత్యాచారాలను, మహిళలపై వేధింపులను పట్టించుకోవడం లేదని అన్నారు. శ్వేతా రెడ్డి వ్యాఖ్యల వీడియో వైరల్ అవుతోంది.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...

కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమే.. యుద్ధం వస్తే మేం సిద్ధం : ఇమ్రాన్‌

జమ్ముకశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు 74వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఐరాస వేదికగా కవ్వింపు ప్రకటన చేశారు. కశ్మీర్‌ను కేవలం రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.   ప్రపంచం ఏం చేసింది?.   బాలాకోట్‌లో 500 మంది తీవ్రవాదులు రెడీగా ఉన్నారని ఇండియా రక్షణ మంత్రి చెబుతున్నారు. 500 మంది తీవ్రవాదులను పంపి మేమేం సాధిస్తాం?. 500 మంది తీవ్రవాదులను పంపాల్సిన అవసరం మాకేంటి.?. ఇస్లామిక్ టెర్రరిజం అంటూ ఇండియా మాపై ముద్ర వేస్తుంది. కశ్మీరీల హక్కులు ఎవరికీ పట్టవు. కశ్మీర్‌లో అనుసరిస్తున్న విధానాలు భారత్‌లో ఉన్న ముస్లింలపై ఎలా ప్రభావం చూపుతాయో మోదీ ఆలోచించారా?. 10 లక్షల మంది రోహింగ్యాలను బర్మా నుంచి గెంటేస్తే ప్రపంచం ఏం చేసింది?. ఇలాంటి పరిణామాలే ఇస్లాం సమాజంలో ఆవేదన, అసంతృప్తిని రేపుతున్నాయి ’  అని ఇమ్రాన్ ఆగ్రహ వ్యక్తం చేశారు. యుద్ధం వస్తే మేం సిద్ధం! ‘ ఇప్పుడు చాలా సంక్లిష్టం సమయం నడుస్తోంది. అణ్వాయుధాలున్న రెండు దేశాలు తలపడాల్స...