Skip to main content

బోరుబావిలో పడి అసువులు బాసిన సుజిత్ తల్లిదండ్రులకు హీరో రాఘవ లారెన్స్ విజ్ఞప్తి!

 

కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ తన పుట్టినరోజున గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల తమిళనాడులో బోరుబావిలో పడి మృతిచెందిన చిన్నారి సుజిత్ తల్లిదండ్రులకు ఒక విన్నపం చేశారు. దేశంలో తల్లిదండ్రులు లేని పిల్లలు ఎంతోమంది వున్నారని, అటువంటి వారిలో ఒకరిని దత్తత తీసుకోమని కోరారు. సుజిత్ పేరునే ఆ పిల్లవాడికి పెట్టమని విజ్ఞప్తి చేశారు. ఆ బాలుడి విద్యకయ్యే ఖర్చును తానే భరిస్తానని తెలిపారు. 

ఈనెల 25న తమిళనాడులోని తిరుచ్చిలో రెండేళ్ల బాలుడు సుజిత్ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోగా, అధికారులు బాలుడిని రక్షించాలని నాలుగురోజులపాటు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ప్రాణాలు కోల్పోయాడు. బిడ్డను కోల్పోయిన సుజిత్ తల్లిదండ్రులకు లారెన్స్ సానుభూతి తెలియజేశారు. సుజిత్ ఎక్కడికీ పోలేదని, దేశ ప్రజల గుండెల్లో బతికే ఉన్నాడని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఈరోజు తన పుట్టిన రోజు అయినప్పటికీ తాను సెలబ్రేట్ చేసుకోవడంలేదని వెల్లడించారు. 

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.