Skip to main content

బిగ్ బాస్ లీక్... నేడు వితిక ఎలిమినేట్!


 



ప్రతి వారమూ లీకులు వస్తున్నట్టుగానే టాలీవుడ్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 3 నుంచి 13వ వారం ఎలిమినేట్ ఎవరవుతారన్న విషయంపైనా లీకులు బయటకు వచ్చాయి. ఈ వారంలో వితికా షేరు బయటకు వెళుతుందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. సీజన్-3 ఇప్పటికే తుది దశకు చేరుకోగా, హౌస్ లో ఏడుగురు మాత్రమే ఉన్నారు. ఈ వారంలో వీరంతా నామినేషన్ లోనే ఉండగా, రాహుల్, శ్రీముఖి, వరుణ్, బాబా భాస్కర్ లు సేఫ్ జోన్ లో ఉన్నారని తెలుస్తోంది. వారికి బాగానే ఓట్లు వచ్చాయి.

ఇక ఇప్పటివరకూ నమోదైన పోల్స్ ట్రెండ్స్ చూస్తే, వితిక, శివజ్యోతి చివరి రెండు స్థానాల్లో ఉన్నారు. ప్రేక్షకులకు చికాకు తెప్పించేలా వితిక వ్యవహరించిందని నెటిజన్లు అంటున్నారు. ఇదే సమయంలో వితిక హౌస్ లో ఉండటంతో వరుణ్ సొంతంగా గేమ్ ఆడలేకున్నాడన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఇక నేడు వితిక ఎలిమినేట్ అయినట్టు బిగ్ బాస్ ప్రకటిస్తాడా? లేక ఏదైనా ట్విస్ట్ ఇస్తాడా? డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే, రాత్రి వరకూ వేచి చూడాల్సిందే.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...