Skip to main content

బిగ్ బాస్ లీక్... నేడు వితిక ఎలిమినేట్!


 



ప్రతి వారమూ లీకులు వస్తున్నట్టుగానే టాలీవుడ్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 3 నుంచి 13వ వారం ఎలిమినేట్ ఎవరవుతారన్న విషయంపైనా లీకులు బయటకు వచ్చాయి. ఈ వారంలో వితికా షేరు బయటకు వెళుతుందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. సీజన్-3 ఇప్పటికే తుది దశకు చేరుకోగా, హౌస్ లో ఏడుగురు మాత్రమే ఉన్నారు. ఈ వారంలో వీరంతా నామినేషన్ లోనే ఉండగా, రాహుల్, శ్రీముఖి, వరుణ్, బాబా భాస్కర్ లు సేఫ్ జోన్ లో ఉన్నారని తెలుస్తోంది. వారికి బాగానే ఓట్లు వచ్చాయి.

ఇక ఇప్పటివరకూ నమోదైన పోల్స్ ట్రెండ్స్ చూస్తే, వితిక, శివజ్యోతి చివరి రెండు స్థానాల్లో ఉన్నారు. ప్రేక్షకులకు చికాకు తెప్పించేలా వితిక వ్యవహరించిందని నెటిజన్లు అంటున్నారు. ఇదే సమయంలో వితిక హౌస్ లో ఉండటంతో వరుణ్ సొంతంగా గేమ్ ఆడలేకున్నాడన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఇక నేడు వితిక ఎలిమినేట్ అయినట్టు బిగ్ బాస్ ప్రకటిస్తాడా? లేక ఏదైనా ట్విస్ట్ ఇస్తాడా? డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే, రాత్రి వరకూ వేచి చూడాల్సిందే.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...