Skip to main content

క్రికెట్ మ్యాచ్ చూడడానికి రండి.. మోదీ, షేక్‌ హసీనాలను 'క్యాబ్‌' ఆహ్వానం

వచ్చే నెలలో భారత్, బంగ్లాదేశ్‌ మధ్య టెస్టు మ్యాచ్ సిరీస్ జరగనుంది. నవంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టుకు ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్‌ హసీనాలకు ఆహ్వానం పంపాలని క్రికెట్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌ (క్యాబ్‌) నిర్ణయం తీసుకుంది. ఈ మ్యాచ్ పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో జరగనుంది. ఈ మైదానంలో టెస్ట్ మ్యాచ్ ఆడటం బంగ్లాదేశ్‌ కు ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీంతో ఇరు దేశాల ప్రధానులను ప్రత్యేకంగా ఆహ్వానించాలని క్యాచ్ నిర్ణయించింది.

 క్రికెట్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌ అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్‌ గంగూలీ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈడెన్‌లో గంట కొట్టి మ్యాచ్‌ ప్రారంభించే పద్ధతిని ఆయన ప్రవేశపెట్టాడు. గతంలో టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాక్ తో జరిగిన మ్యాచ్‌కు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌ను క్యాబ్‌ ఆహ్వానించింది. ప్రపంచకప్‌-2011 సెమీఫైనల్‌లో మొహాలీలో జరిగిన మ్యాచ్ కు అప్పటి భారత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, యూసఫ్‌ రజా గిలానీలు హాజరై మ్యాచ్ ను చూసిన విషయం తెలిసిందే.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.