Skip to main content

హంగ్ దిశగా హరియాణా... కింగ్ మేకర్ జేజేపీ... తీవ్ర ఉత్కంఠ!


90 అసెంబ్లీ నియోజకవర్గాలున్న హరియాణాలో ప్రజలు ఏ పార్టీకీ భారీ ఆధిక్యాన్ని ఇచ్చే అవకాశాలు లేవని స్పష్టమవుతోంది. అధికారంలో ఉన్న బీజేపీ, మరోసారి గద్దెనెక్కేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కు ఒకటి, రెండు అడుగుల దూరంలో నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్, జేజేపీలు కలిస్తే, మ్యాజిక్ ఫిగర్ కు మరింత చేరువయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో ఈ దఫా హంగ్ ఏర్పడవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుత ట్రెండ్స్ పరిశీలిస్తే, బీజేపీ 38, కాంగ్రెస్ 29, ఐఎన్ఎల్డీ 1, జేజేపీ 12, ఇతరులు 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, మరో రెండు చోట్ల సాంకేతిక కారణాలతో ఓట్ల లెక్కింపు ఆలస్యమైంది. అధికార పీఠం దక్కాలంటే 46 సీట్లు అవసరం కాగా, ఏ పార్టీకీ అన్ని సీట్లు లభించే అవకాశం ప్రస్తుతం కనిపించడం లేదు. ఫలితాల సరళి తీవ్ర ఉత్కంఠతను రేకెత్తిస్తుండటంతో క్యాంప్ రాజకీయాలు సైతం మొదలైపోయాయి.

ఎన్నికల్లో పోటీ చేసిన అందరు అభ్యర్థులూ పార్టీ కార్యాలయానికి చేరుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించింది. ఇదే సమయంలో జేజేపీని కలుపుకుని ముందుకు సాగే దిశగానూ ఆ పార్టీ తనవంతు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు సమాచారం. చివరి వరకూ ఫలితాలు ఇదే విధంగా కొనసాగితే, జేజేపీ కింగ్ మేకర్ అవుతుందనడంలో సందేహం లేదు.   

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...