Skip to main content

హంగ్ దిశగా హరియాణా... కింగ్ మేకర్ జేజేపీ... తీవ్ర ఉత్కంఠ!


90 అసెంబ్లీ నియోజకవర్గాలున్న హరియాణాలో ప్రజలు ఏ పార్టీకీ భారీ ఆధిక్యాన్ని ఇచ్చే అవకాశాలు లేవని స్పష్టమవుతోంది. అధికారంలో ఉన్న బీజేపీ, మరోసారి గద్దెనెక్కేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కు ఒకటి, రెండు అడుగుల దూరంలో నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్, జేజేపీలు కలిస్తే, మ్యాజిక్ ఫిగర్ కు మరింత చేరువయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో ఈ దఫా హంగ్ ఏర్పడవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుత ట్రెండ్స్ పరిశీలిస్తే, బీజేపీ 38, కాంగ్రెస్ 29, ఐఎన్ఎల్డీ 1, జేజేపీ 12, ఇతరులు 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, మరో రెండు చోట్ల సాంకేతిక కారణాలతో ఓట్ల లెక్కింపు ఆలస్యమైంది. అధికార పీఠం దక్కాలంటే 46 సీట్లు అవసరం కాగా, ఏ పార్టీకీ అన్ని సీట్లు లభించే అవకాశం ప్రస్తుతం కనిపించడం లేదు. ఫలితాల సరళి తీవ్ర ఉత్కంఠతను రేకెత్తిస్తుండటంతో క్యాంప్ రాజకీయాలు సైతం మొదలైపోయాయి.

ఎన్నికల్లో పోటీ చేసిన అందరు అభ్యర్థులూ పార్టీ కార్యాలయానికి చేరుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించింది. ఇదే సమయంలో జేజేపీని కలుపుకుని ముందుకు సాగే దిశగానూ ఆ పార్టీ తనవంతు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు సమాచారం. చివరి వరకూ ఫలితాలు ఇదే విధంగా కొనసాగితే, జేజేపీ కింగ్ మేకర్ అవుతుందనడంలో సందేహం లేదు.   

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...