Skip to main content

నేను మరణిస్తే ఒకే పార్టీ జెండా కప్పించుకుంటా... నాలుగు పార్టీల జెండాలు కప్పించుకోను: జూపూడిపై అయ్యన్న విమర్శలు

వైసీపీలో చేరిన జూపూడి ప్రభాకర్ రావుపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. తాజాగా, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తల్లిలాంటి పార్టీ కష్టాల్లో ఉంటే, పార్టీని వదిలి పారిపోయేవాళ్లు పిరికిపందలతో సమానం అని, అలాంటివాళ్లు తమకు అవసరంలేదని అన్నారు.

 తాను చనిపోతే ఒకే పార్టీ జెండా కప్పించుకుంటానే తప్ప నాలుగు పార్టీల జెండాలు కప్పించుకోనని వ్యాఖ్యానించారు. ఇలాంటి అవకాశవాదులు ఏ పార్టీలో ఉన్నా చీడపురుగులు వంటివారేనని, వారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. వారిని దూరంగా పారద్రోలినప్పుడే రాజకీయాలకు అంటిన మురికి వదిలిపోతుందని వ్యాఖ్యానించారు.   

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...