Skip to main content

చిరు వెంటే గంటా...!?

ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి పెట్టినపుడు ఉత్తరాంధ్ర జిల్లాలకు పెద్ద దిక్కుగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహరించిన సంగతి తెలిసిందే. గంటా పార్టీ పటిష్టత కోసం తన వంతుగా క్రుషి చేశారు. దాని ఫలితంగా విశాఖ జిల్లా నుంచి నలుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి దక్కారు. ఇక ఈ బలంతోనే గంటా ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసినపుడు మంత్రి పదవి సంపాదించారు. తరువాత చిరంజీవి రాజకీయ జీవితం అగిపోయింది.
గంటా మాత్రం తన సైన్యంతో టీడీపీలో చేరి అక్కడ కూడా మంత్రి పదవి సంపాదించారు. ఇలా ఏడేళ్లకు పైగా మంత్రిగా పనిచేసిన గంటాకు తాజా ఎన్నికల్లో టీడీపీ ఓటమితో బ్రేక్ వచ్చిపడింది. ఆయన టీడీపీకి దూరంగా ఉన్నారు. అదే సమయంలో వైసీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది.అయితే ఆయన ఎపుడు చేరుతారు ఏంటన్నది ఇంకా తేలలేదు. కానీ ఇపుడు ఆయన చిరంజీవిని పట్టుకుని తిరుగుతుండడం వెనక మతలబు ఏంటన్నది ఎవరికీ అర్ధం కావడం లేదు.
సైరా సక్సెస్ ఫంక్షన్ సందర్భంగా మెగా నిర్మాత అల్లు అరవింద్ మెగా పార్టీ ఇస్తే దానికి హాజరైన గంటా సందడి చేశారు. ఇక మహా నటుడు ఎస్వీయార్ విగ్రహావిష్కరణ తాడేపల్లిగూడేంలో జరిగితే చిరంజీవి వెంటే హైదరాబాద్ నుంచి వచ్చి ఆయన పక్కనే నడుస్తూ కనిపించారు. ఇలా చిరంజీవిని పట్టుకుని తిరగడంతో గంటా వ్యూహం ఏంటి అన్నది ఎవరికీ అర్ధం కావడం లేదు.

కొంపదీసి చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారా, గంటా రాజకీయ మంతనాలు కూడా చేస్తున్నారా అన్న డౌట్లు వస్తున్నాయి. ఏది ఏమైనా గంటా ఇపుడు మెగా పార్టీలో ఉన్నారని అర్ధమైందంటున్నారు. ఏది ఏమైనా గంటా ఆలోచనలు, వ్యూహాలు ఎవరికీ అర్ధం కావని అంటున్నారు. అందువల్ల వెయిట్ అండ్ సీ.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...