Skip to main content

చిరు వెంటే గంటా...!?

ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి పెట్టినపుడు ఉత్తరాంధ్ర జిల్లాలకు పెద్ద దిక్కుగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహరించిన సంగతి తెలిసిందే. గంటా పార్టీ పటిష్టత కోసం తన వంతుగా క్రుషి చేశారు. దాని ఫలితంగా విశాఖ జిల్లా నుంచి నలుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి దక్కారు. ఇక ఈ బలంతోనే గంటా ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసినపుడు మంత్రి పదవి సంపాదించారు. తరువాత చిరంజీవి రాజకీయ జీవితం అగిపోయింది.
గంటా మాత్రం తన సైన్యంతో టీడీపీలో చేరి అక్కడ కూడా మంత్రి పదవి సంపాదించారు. ఇలా ఏడేళ్లకు పైగా మంత్రిగా పనిచేసిన గంటాకు తాజా ఎన్నికల్లో టీడీపీ ఓటమితో బ్రేక్ వచ్చిపడింది. ఆయన టీడీపీకి దూరంగా ఉన్నారు. అదే సమయంలో వైసీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది.అయితే ఆయన ఎపుడు చేరుతారు ఏంటన్నది ఇంకా తేలలేదు. కానీ ఇపుడు ఆయన చిరంజీవిని పట్టుకుని తిరుగుతుండడం వెనక మతలబు ఏంటన్నది ఎవరికీ అర్ధం కావడం లేదు.
సైరా సక్సెస్ ఫంక్షన్ సందర్భంగా మెగా నిర్మాత అల్లు అరవింద్ మెగా పార్టీ ఇస్తే దానికి హాజరైన గంటా సందడి చేశారు. ఇక మహా నటుడు ఎస్వీయార్ విగ్రహావిష్కరణ తాడేపల్లిగూడేంలో జరిగితే చిరంజీవి వెంటే హైదరాబాద్ నుంచి వచ్చి ఆయన పక్కనే నడుస్తూ కనిపించారు. ఇలా చిరంజీవిని పట్టుకుని తిరగడంతో గంటా వ్యూహం ఏంటి అన్నది ఎవరికీ అర్ధం కావడం లేదు.

కొంపదీసి చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారా, గంటా రాజకీయ మంతనాలు కూడా చేస్తున్నారా అన్న డౌట్లు వస్తున్నాయి. ఏది ఏమైనా గంటా ఇపుడు మెగా పార్టీలో ఉన్నారని అర్ధమైందంటున్నారు. ఏది ఏమైనా గంటా ఆలోచనలు, వ్యూహాలు ఎవరికీ అర్ధం కావని అంటున్నారు. అందువల్ల వెయిట్ అండ్ సీ.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.