Skip to main content

చిరు వెంటే గంటా...!?

ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి పెట్టినపుడు ఉత్తరాంధ్ర జిల్లాలకు పెద్ద దిక్కుగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహరించిన సంగతి తెలిసిందే. గంటా పార్టీ పటిష్టత కోసం తన వంతుగా క్రుషి చేశారు. దాని ఫలితంగా విశాఖ జిల్లా నుంచి నలుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి దక్కారు. ఇక ఈ బలంతోనే గంటా ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసినపుడు మంత్రి పదవి సంపాదించారు. తరువాత చిరంజీవి రాజకీయ జీవితం అగిపోయింది.
గంటా మాత్రం తన సైన్యంతో టీడీపీలో చేరి అక్కడ కూడా మంత్రి పదవి సంపాదించారు. ఇలా ఏడేళ్లకు పైగా మంత్రిగా పనిచేసిన గంటాకు తాజా ఎన్నికల్లో టీడీపీ ఓటమితో బ్రేక్ వచ్చిపడింది. ఆయన టీడీపీకి దూరంగా ఉన్నారు. అదే సమయంలో వైసీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది.అయితే ఆయన ఎపుడు చేరుతారు ఏంటన్నది ఇంకా తేలలేదు. కానీ ఇపుడు ఆయన చిరంజీవిని పట్టుకుని తిరుగుతుండడం వెనక మతలబు ఏంటన్నది ఎవరికీ అర్ధం కావడం లేదు.
సైరా సక్సెస్ ఫంక్షన్ సందర్భంగా మెగా నిర్మాత అల్లు అరవింద్ మెగా పార్టీ ఇస్తే దానికి హాజరైన గంటా సందడి చేశారు. ఇక మహా నటుడు ఎస్వీయార్ విగ్రహావిష్కరణ తాడేపల్లిగూడేంలో జరిగితే చిరంజీవి వెంటే హైదరాబాద్ నుంచి వచ్చి ఆయన పక్కనే నడుస్తూ కనిపించారు. ఇలా చిరంజీవిని పట్టుకుని తిరగడంతో గంటా వ్యూహం ఏంటి అన్నది ఎవరికీ అర్ధం కావడం లేదు.

కొంపదీసి చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారా, గంటా రాజకీయ మంతనాలు కూడా చేస్తున్నారా అన్న డౌట్లు వస్తున్నాయి. ఏది ఏమైనా గంటా ఇపుడు మెగా పార్టీలో ఉన్నారని అర్ధమైందంటున్నారు. ఏది ఏమైనా గంటా ఆలోచనలు, వ్యూహాలు ఎవరికీ అర్ధం కావని అంటున్నారు. అందువల్ల వెయిట్ అండ్ సీ.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...