Skip to main content

టీడీపీ ప్రభుత్వం అప్పులను వారసత్వంగా ఇచ్చింది: ఏపీ మంత్రి బుగ్గన

 
ఆంధ్రప్రదేశ్ లో గతంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం అప్పులను, తీవ్ర గడ్డు పరిస్థితులను వారసత్వంగా తమకు ఇచ్చిందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. ఈరోజు మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు. మాజీ సీఎం చంద్రబాబునాయుడు, మాజీ ఆర్థిక మంత్రి మంత్రి యనమల రామకృష్ణుడు అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. టీడీపీ అప్పులన్నీ తమపైకి నెట్టి  విమర్శలకు దిగిందని మండిపడ్డారు. నీతి ఆయోగ్ ర్యాంకుల్లో రాష్ట్ర స్థానం 16కు పడిపోవడానికి యనమల అనుసరించిన విధానాలే కారణమన్నారు. వారి విధానాల వల్లే ఇసుక కొరత ఏర్పడిందని చెప్పారు. తమ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరిస్తుందని పేర్కొన్నారు.  విద్యుత్ కోతలపై వచ్చిన మీడియా కథనాలను మంత్రి ఖండిస్తూ.. పర్యావరణానికి హాని కలుగుతుందని థర్మల్ విద్యుదుత్పాదను తగ్గించామన్నారు. ప్రభుత్వ పథకాలపై టీడీపీ అర్థం లేని విమర్శలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారన్నారు. వైసీపీ ప్రభుత్వ పనితీరుకు క్రిసిల్ డి రేటింగ్ ఇచ్చిందనడం సరికాదన్నారు.   

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...