Skip to main content

ఉగ్రసంస్థలను పాక్ కట్టడి చేయాలి.. లేకపోతే భారత్ పై రెచ్చిపోతాయి: అమెరికా ఆందోళన

భారత్ తో పాకిస్థాన్, చైనా సంబంధాలపై అమెరికా రక్షణ శాఖ ఇండో-పసిఫిక్ విభాగం అసిస్టెంట్ సెక్రటరీ రాండాల్ ష్రివర్ మీడియాతో మాట్లాడారు. జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్థాన్ లో ఉగ్రమూకలు ఇష్టానుసారం రెచ్చిపోయే ప్రమాదం ఉందని, వాటిని పాక్ కచ్చితంగా నియంత్రించాలని సూచించారు. పాక్ కట్టడి చేయకపోతే ఆ ఉగ్రసంస్థలు భారత్ పై దాడులకు పాల్పడే అవకాశముందని రాండాల్ ష్రివర్ ఆందోళన వ్యక్తం చేశారు.

పాక్ కు చైనా కేవలం దౌత్య, రాజకీయపరమైన మద్దతు మాత్రమే ఇస్తుందని భావిస్తున్నామని, చైనా కూడా భారత్ తో సత్సంబంధాలనే కోరుకుంటోందని ఆయన వెల్లడించారు. కేవలం కొన్ని అంశాల్లోనే పాక్ తో చైనా సన్నిహితంగా ఉంటోందని స్పష్టం చేశారు. కానీ, ఉగ్రసంస్థలను నిలువరించే విషయంలో పాక్ వైఖరిపైనే ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయని ష్రివర్ తెలిపారు. ఉగ్రకళ్లాలు పాక్ చేతిలోనే ఉన్నాయన్న విషయం ష్రివర్ వ్యాఖ్యల ద్వారా అంతర్జాతీయ సమాజానికి మరోసారి వెల్లడైంది.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...