Skip to main content

ఉగ్రసంస్థలను పాక్ కట్టడి చేయాలి.. లేకపోతే భారత్ పై రెచ్చిపోతాయి: అమెరికా ఆందోళన

భారత్ తో పాకిస్థాన్, చైనా సంబంధాలపై అమెరికా రక్షణ శాఖ ఇండో-పసిఫిక్ విభాగం అసిస్టెంట్ సెక్రటరీ రాండాల్ ష్రివర్ మీడియాతో మాట్లాడారు. జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్థాన్ లో ఉగ్రమూకలు ఇష్టానుసారం రెచ్చిపోయే ప్రమాదం ఉందని, వాటిని పాక్ కచ్చితంగా నియంత్రించాలని సూచించారు. పాక్ కట్టడి చేయకపోతే ఆ ఉగ్రసంస్థలు భారత్ పై దాడులకు పాల్పడే అవకాశముందని రాండాల్ ష్రివర్ ఆందోళన వ్యక్తం చేశారు.

పాక్ కు చైనా కేవలం దౌత్య, రాజకీయపరమైన మద్దతు మాత్రమే ఇస్తుందని భావిస్తున్నామని, చైనా కూడా భారత్ తో సత్సంబంధాలనే కోరుకుంటోందని ఆయన వెల్లడించారు. కేవలం కొన్ని అంశాల్లోనే పాక్ తో చైనా సన్నిహితంగా ఉంటోందని స్పష్టం చేశారు. కానీ, ఉగ్రసంస్థలను నిలువరించే విషయంలో పాక్ వైఖరిపైనే ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయని ష్రివర్ తెలిపారు. ఉగ్రకళ్లాలు పాక్ చేతిలోనే ఉన్నాయన్న విషయం ష్రివర్ వ్యాఖ్యల ద్వారా అంతర్జాతీయ సమాజానికి మరోసారి వెల్లడైంది.

Comments

Popular posts from this blog

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.