Skip to main content

నా వారసుడు జస్టిస్ బాబ్డే... మోదీ సర్కారు అభిప్రాయాన్ని కోరిన జస్టిస్ రంజన్ గొగొయ్!

తాను వచ్చే నెల 17న పదవీ విమరణ చేయనున్న నేపథ్యంలో సుప్రీంకోర్టుకు తదుపరి చీఫ్ జస్టిస్ గా శరద్ అరవింద్ బాబ్డేను సిఫార్సు చేస్తూ, కేంద్రం అభిప్రాయం చెప్పాలని ప్రస్తుత సీజే రంజన్ గొగొయ్ కోరారు. ఈ నేరకు మోదీ సర్కారుకు లేఖ రాసిన ఆయన, తన తరువాత సీనియారిటీలో బాబ్డే రెండో స్థానంలో ఉన్నారని గుర్తు చేశారు. కాగా, జస్టిస్ బాబ్డే, గతంలో మధ్య ప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. 2021, ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయనున్నారు.

1956, ఏప్రిల్ 24న మహారాష్ట్రలోని నాగపూర్ లో జన్మించిన బాబ్డే, నాగపూర్ యూనివర్శిటీలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఆపై 2000 సంవత్సరంలో బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2012లో మధ్యప్రదేశ్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ అయ్యారు. ఏప్రిల్ 2013 నుంచి సుప్రీంకోర్టులో విధులను నిర్వహిస్తున్నారు. స్వయంగా గొగొయ్ నుంచి సిఫార్సులు రావడంతో బాబ్డే నియామకం వైపు కేంద్రం మొగ్గు చూపవచ్చని తెలుస్తోంది.   

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...

కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమే.. యుద్ధం వస్తే మేం సిద్ధం : ఇమ్రాన్‌

జమ్ముకశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు 74వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఐరాస వేదికగా కవ్వింపు ప్రకటన చేశారు. కశ్మీర్‌ను కేవలం రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.   ప్రపంచం ఏం చేసింది?.   బాలాకోట్‌లో 500 మంది తీవ్రవాదులు రెడీగా ఉన్నారని ఇండియా రక్షణ మంత్రి చెబుతున్నారు. 500 మంది తీవ్రవాదులను పంపి మేమేం సాధిస్తాం?. 500 మంది తీవ్రవాదులను పంపాల్సిన అవసరం మాకేంటి.?. ఇస్లామిక్ టెర్రరిజం అంటూ ఇండియా మాపై ముద్ర వేస్తుంది. కశ్మీరీల హక్కులు ఎవరికీ పట్టవు. కశ్మీర్‌లో అనుసరిస్తున్న విధానాలు భారత్‌లో ఉన్న ముస్లింలపై ఎలా ప్రభావం చూపుతాయో మోదీ ఆలోచించారా?. 10 లక్షల మంది రోహింగ్యాలను బర్మా నుంచి గెంటేస్తే ప్రపంచం ఏం చేసింది?. ఇలాంటి పరిణామాలే ఇస్లాం సమాజంలో ఆవేదన, అసంతృప్తిని రేపుతున్నాయి ’  అని ఇమ్రాన్ ఆగ్రహ వ్యక్తం చేశారు. యుద్ధం వస్తే మేం సిద్ధం! ‘ ఇప్పుడు చాలా సంక్లిష్టం సమయం నడుస్తోంది. అణ్వాయుధాలున్న రెండు దేశాలు తలపడాల్స...