Skip to main content

మా సెల్ ఫోన్లు లాక్కుని చర్చలు జరిపారు: ఆర్టీసీ జేఏసీ నేతల అసంతృప్తి

ఆర్టీసీ యాజమాన్యంతో తాము జరిపిన చర్చలు అర్ధాంతరంగా ముగిశాయని తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. ఆర్టీసీ చరిత్రలో ఇంతటి నిర్బంధ చర్చలు తాను చూడలేదని చెప్పారు. ఆర్టీసీ సమ్మె ఆగదని, కొనసాగుతుందని స్పష్టం చేశారు. తాము డిమాండ్ చేసిన అన్ని అంశాలను యాజమాన్యం పట్టించుకోలేదని కొన్ని డిమాండ్లనే వారు పరిగణనలోకి తీసుకున్నారన్నారు.

హైకోర్టు ఆదేశాల మేరకు  ఎర్రమంజిల్ లోని ఈఎన్ సీ కార్యాలయంలో ఇరు వర్గాల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. ఆర్టీసీ యాజమాన్యంతో జరిగిన ఈ చర్చల్లో అశ్వత్థామరెడ్డి, మరో ముగ్గురు సహ కన్వీనర్లు కార్మికులకు ప్రాతినిధ్యం వహించారు.

చర్చల అనంతరం అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘ చర్చల ప్రారంభానికి ముందే మా మొబైల్ ఫోన్లు లాక్కున్నారు. ఇవి నిర్బంధ చర్చలు. మేము 26 డిమాండ్లను వారి ముందుంచగా యాజమాన్యం 21 డిమాండ్లపైనే మాట్లాడతామంది. యాజమాన్యం ముందే ఒక ఎజెండాతో సమావేశస్థలికి వచ్చింది. లోపల జరిగిన సంభాషణలపై మా కార్మికులతో కలిసి చర్చిస్తాం. తిరిగి చర్చలకు ఆహ్వానిస్తే సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు.

ఈ చర్చలు కోర్టును తృప్తి పరిచేందుకు జరిపినట్లుందని, సమ్మె కొనసాగుతుందని జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి చెప్పారు. చర్చల్లో పాల్గొన్న మరో కో కన్వీనర్ వీఎస్ రావు మాట్లాడుతూ జేఏసీ నేతలు చర్చలకు సహకరించలేదంటూ ఆర్టీసీ యాజమాన్యం ఆరోపిస్తోందన్నారు.  

Comments

Popular posts from this blog

ఉల్లిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!

  ఆకాశాన్నంటిన్న ఉల్లిపాయల ధరలను కిందకు దించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని వెలువరించింది. ఈ నెలాఖరులోగా 2 వేల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఎంఎంటీసీ ద్వారా టెండర్లను కేంద్రం ఆహ్వానించింది. ఈ సంవత్సరం ఉల్లి దిగుబడి తగ్గడంతో కిలో ఉల్లిపాయల ధర రూ. 80 వరకూ పలుకుతుండగా, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న సంగతి తెలిసిందే. అసలే పండగల సీజన్ కావడం, పైగా మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఈ నెలాఖరులో జరుగనున్న నేపథ్యంలో, ప్రజా వ్యతిరేకతను తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

తమిళనాడులో కుండపోత వర్షం...వరుణాగ్రహంతో వణుకుతున్న రాష్ట్రం!

  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడులో కుండపోతగా వర్షం కురుస్తోంది. పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో జనం వణుకుతున్నారు. రాష్ట్రంలోని కాంచీపురం, ఆర్కేనగర్‌, తిరుత్తణి, తూత్తుకుడి, తిరునల్వేలి, తంజావూరు, తిరువారూరు, శివగంగై జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.  ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం వర్షబీభత్సం అధికంగా ఉన్న మధురై, రామనాథపురం జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించింది. సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను ప్రభుత్వం కోరింది.