Skip to main content

మా సెల్ ఫోన్లు లాక్కుని చర్చలు జరిపారు: ఆర్టీసీ జేఏసీ నేతల అసంతృప్తి

ఆర్టీసీ యాజమాన్యంతో తాము జరిపిన చర్చలు అర్ధాంతరంగా ముగిశాయని తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. ఆర్టీసీ చరిత్రలో ఇంతటి నిర్బంధ చర్చలు తాను చూడలేదని చెప్పారు. ఆర్టీసీ సమ్మె ఆగదని, కొనసాగుతుందని స్పష్టం చేశారు. తాము డిమాండ్ చేసిన అన్ని అంశాలను యాజమాన్యం పట్టించుకోలేదని కొన్ని డిమాండ్లనే వారు పరిగణనలోకి తీసుకున్నారన్నారు.

హైకోర్టు ఆదేశాల మేరకు  ఎర్రమంజిల్ లోని ఈఎన్ సీ కార్యాలయంలో ఇరు వర్గాల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. ఆర్టీసీ యాజమాన్యంతో జరిగిన ఈ చర్చల్లో అశ్వత్థామరెడ్డి, మరో ముగ్గురు సహ కన్వీనర్లు కార్మికులకు ప్రాతినిధ్యం వహించారు.

చర్చల అనంతరం అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘ చర్చల ప్రారంభానికి ముందే మా మొబైల్ ఫోన్లు లాక్కున్నారు. ఇవి నిర్బంధ చర్చలు. మేము 26 డిమాండ్లను వారి ముందుంచగా యాజమాన్యం 21 డిమాండ్లపైనే మాట్లాడతామంది. యాజమాన్యం ముందే ఒక ఎజెండాతో సమావేశస్థలికి వచ్చింది. లోపల జరిగిన సంభాషణలపై మా కార్మికులతో కలిసి చర్చిస్తాం. తిరిగి చర్చలకు ఆహ్వానిస్తే సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు.

ఈ చర్చలు కోర్టును తృప్తి పరిచేందుకు జరిపినట్లుందని, సమ్మె కొనసాగుతుందని జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి చెప్పారు. చర్చల్లో పాల్గొన్న మరో కో కన్వీనర్ వీఎస్ రావు మాట్లాడుతూ జేఏసీ నేతలు చర్చలకు సహకరించలేదంటూ ఆర్టీసీ యాజమాన్యం ఆరోపిస్తోందన్నారు.  

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

పుట్టినరోజు కేక్ కట్ చేయడంపై తన అభిప్రాయాలు వెల్లడించిన పవన్ కల్యాణ్

 జనసేన పార్టీ అధ్యక్షుడు, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదినోత్సవం (సెప్టెంబరు 2) సందర్భంగా ఆయన అభిమానుల్లో కోలాహలం నెలకొంది. ఆయన మాత్రం ఎప్పటిలాగానే ఎంతో కూల్ గా కనిపించారు. తన బర్త్ డే సందర్భంగా పెద్దగా ఎప్పుడూ కేకులు కట్ చేయని పవన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించారు. చిన్నప్పటి నుంచి తనకు బర్త్ డే వేడుకలపై ఆసక్తి తక్కువని తెలిపారు. ఒకట్రెండు సార్లు స్కూల్లో చాక్లెట్లు పంచానని, కొన్ని సందర్భాల్లో తన కుటుంబ సభ్యులు కూడా తన పుట్టినరోజు సంగతి మర్చిపోయేవారని వెల్లడించారు. ఎప్పుడైనా తన పుట్టినరోజు సంగతి గుర్తొస్తే వదిన డబ్బులు ఇచ్చేవారని, ఆ డబ్బులతో పుస్తకాలు కొనుక్కోవడం తప్ప ప్రత్యేకమైన వేడుకలు తక్కువేనని పవన్ వివరించారు. "ఇక సినీ రంగంలోకి వచ్చిన తర్వాత నా పుట్టినరోజు వేడుకలను ఫ్రెండ్స్, నిర్మాతలు చేస్తుంటే ఇబ్బందికరంగా అనిపించేది. కేకు కోయడం, ఆ కేకు ముక్కలను నోట్లో పెట్టడం అంతా ఎబ్బెట్టుగా అనిపించేది. అందుకే జన్మదిన వేడుకలంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు... దీనికి వేరే కారణాలేవీ లేవు" అని పవన్ తెలిపారు.