Skip to main content

తెలుగు, తమిళ రాష్ట్రాల్లో 'కల్కి' లీలలు : గుట్టలుగా నోట్ల కట్టలు, బంగారం

ఆశ్రమం గుట్టు రట్టయింది. ఆధ్యాత్మిక వేత్త అసలు బండారం బయటపడింది. దీంతో కల్కి భగవాన్‌..ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడులో మారుమోగుతున్న పేరు ఇది. ఓ సాధారణ ఎల్‌ఐసీ ఏజెంట్ వందల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టిన వైనం వెనుక ఉన్న మిస్టరీ అర్థంకాక ఆయన భక్తులే కాదు, సామాన్యులు జుత్తు పీక్కుంటున్నారు. తాను భగవంతుని పదో అవతారంగా చెప్పుకుంటూ భక్తుల బలహీనత నుంచి రాబట్టుకున్న డబ్బుతో కోట్లకు పడగలెత్తినట్టు బయటపడుతుండడం ఆశ్చర్యపరుస్తోంది. కల్కి ఆశ్రమమే ఓ మిస్టరీ. ప్రస్తుతం ఆదాయ పన్ను శాఖ దాడులతో ఈ మిస్టరీ బద్దలవుతుండడం కలకలానికి కారణమైంది.

కల్కి ఆశ్రమాలపై ఈనెల 16న ఐటీ అధికారులు దాడులు మొదలు పెట్టారు. ఆశ్రమానికి సంబంధించి మూడు రాష్ట్రాల్లో ఉన్న కేంద్రాల్లోనూ తనిఖీలు కొనసాగిస్తున్నారు. తొలిరోజు దాడుల్లోనే స్వాధీనం చేసుకున్న నగదు, ఆభరణాల విలువ రూ.93 కోట్లు ఉంటుందని తేల్చారు. ఇందులో 43.9 కోట్లు నగదు రూపంలో ఉండగా, రూ.18 కోట్ల విలువైన అమెరికన్‌ డాలర్లు, 26 కోట్ల విలువ చేసే 88 కిలోల బంగారం, రూ.5 కోట్ల విలువ చేసే 1271 క్యారెట్ల వజ్రాలు ఉన్నాయి.

అయితే లెక్క తేలని ఆదాయం మరో రూ.500 కోట్ల వరకు ఉంటుందని ఆదాయ పన్ను శాఖ అధికారులు చెబుతున్నారు. కల్కి అనుబంధ సంస్థలు చైనా, అమెరికా, సింగపూర్‌, యూఏఈల్లోని కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నట్లు గుర్తించారు. దేశీయంగా కల్కి సంస్థలు నిర్వహిస్తున్న కోర్సులకు దేశవిదేశాల నుంచి క్లయింట్లు హాజరవుతుంటారు.

వారి నుంచి వచ్చే డబ్బులో పన్ను చెల్లించాల్సిన ఆదాయాన్ని తమ గ్రూపు కంపెనీల ద్వారా విదేశాలకు మళ్లిస్తున్నట్లు ఆదాయ పన్ను శాఖ అధికారులు గుర్తించారు. అలాగే, విదేశీ క్లయింట్ల నుంచి నగదు రూపంలో తీసుకుంటున్న మొత్తానికి కూడా సరిగా లెక్కలు చూపడం లేదని తేల్చారు.   

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...