Skip to main content

వర్ల వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం: ఏపీ పోలీస్ అధికారుల సంఘం

 



ఏపీ పోలీసులపై టీడీపీ నేత వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలపై పోలీస్ అధికారుల సంఘం మండిపడుతున్న విషయం తెలిసిందే. తాను దళితుడిని అని చెప్పి తనను ఈవిధంగా ఇబ్బందిపెడుతున్నారంటూ వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలను పోలీస్ అధికారుల సంఘం ఖండించింది.

విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలీస్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి మస్తాన్ మాట్లాడుతూ, పోలీసులకు కులం, మతం లేవు అని, తమది ‘ఖాకీ కులం’ అని, పోలీస్ శాఖను ఎవరు కించపరిచేలా మాట్లాడినా సహించమని హెచ్చరించారు. గతంలో పోలీస్ ఉద్యోగిగా పని చేసిన వర్ల రామయ్యపై తమకు ఎప్పుడూ గౌరవం ఉంటుందని అన్నారు.

పోలీసుల జాతకాలు తెలుసు అని, అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన మాట్లాడటం సబబు కాదని హితవు పలికారు. అసలు, ఇలాంటి వ్యాఖ్యలను ఖండించాల్సిన ఆయన, డీజీపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు అని విమర్శించారు. పోలీసుల జాతకాలు తన దగ్గర ఉన్నాయంటూ బెదిరింపు వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్టు చెప్పారు.

పోలీస్ అధికారుల సంఘం ఉపాధ్యక్షురాలు స్వర్ణలత మాట్లాడుతూ, ఒకప్పుడు పోలీస్ గా, సంఘం సభ్యుడిగా పని చేసిన వర్ల రామయ్యకు పోలీస్ వ్యవస్థ ఎలా ఉంటుందో తెలియదా అని ప్రశ్నించారు. విలేకరుల సమావేశం నిర్వహించే అర్హత పోలీసుల సంఘానికి లేదన్న వర్ల,  ఎందుకు లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...