Skip to main content

వర్ల వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం: ఏపీ పోలీస్ అధికారుల సంఘం

 



ఏపీ పోలీసులపై టీడీపీ నేత వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలపై పోలీస్ అధికారుల సంఘం మండిపడుతున్న విషయం తెలిసిందే. తాను దళితుడిని అని చెప్పి తనను ఈవిధంగా ఇబ్బందిపెడుతున్నారంటూ వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలను పోలీస్ అధికారుల సంఘం ఖండించింది.

విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలీస్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి మస్తాన్ మాట్లాడుతూ, పోలీసులకు కులం, మతం లేవు అని, తమది ‘ఖాకీ కులం’ అని, పోలీస్ శాఖను ఎవరు కించపరిచేలా మాట్లాడినా సహించమని హెచ్చరించారు. గతంలో పోలీస్ ఉద్యోగిగా పని చేసిన వర్ల రామయ్యపై తమకు ఎప్పుడూ గౌరవం ఉంటుందని అన్నారు.

పోలీసుల జాతకాలు తెలుసు అని, అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన మాట్లాడటం సబబు కాదని హితవు పలికారు. అసలు, ఇలాంటి వ్యాఖ్యలను ఖండించాల్సిన ఆయన, డీజీపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు అని విమర్శించారు. పోలీసుల జాతకాలు తన దగ్గర ఉన్నాయంటూ బెదిరింపు వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్టు చెప్పారు.

పోలీస్ అధికారుల సంఘం ఉపాధ్యక్షురాలు స్వర్ణలత మాట్లాడుతూ, ఒకప్పుడు పోలీస్ గా, సంఘం సభ్యుడిగా పని చేసిన వర్ల రామయ్యకు పోలీస్ వ్యవస్థ ఎలా ఉంటుందో తెలియదా అని ప్రశ్నించారు. విలేకరుల సమావేశం నిర్వహించే అర్హత పోలీసుల సంఘానికి లేదన్న వర్ల,  ఎందుకు లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...