Skip to main content

వర్ల వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం: ఏపీ పోలీస్ అధికారుల సంఘం

 



ఏపీ పోలీసులపై టీడీపీ నేత వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలపై పోలీస్ అధికారుల సంఘం మండిపడుతున్న విషయం తెలిసిందే. తాను దళితుడిని అని చెప్పి తనను ఈవిధంగా ఇబ్బందిపెడుతున్నారంటూ వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలను పోలీస్ అధికారుల సంఘం ఖండించింది.

విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలీస్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి మస్తాన్ మాట్లాడుతూ, పోలీసులకు కులం, మతం లేవు అని, తమది ‘ఖాకీ కులం’ అని, పోలీస్ శాఖను ఎవరు కించపరిచేలా మాట్లాడినా సహించమని హెచ్చరించారు. గతంలో పోలీస్ ఉద్యోగిగా పని చేసిన వర్ల రామయ్యపై తమకు ఎప్పుడూ గౌరవం ఉంటుందని అన్నారు.

పోలీసుల జాతకాలు తెలుసు అని, అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన మాట్లాడటం సబబు కాదని హితవు పలికారు. అసలు, ఇలాంటి వ్యాఖ్యలను ఖండించాల్సిన ఆయన, డీజీపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు అని విమర్శించారు. పోలీసుల జాతకాలు తన దగ్గర ఉన్నాయంటూ బెదిరింపు వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్టు చెప్పారు.

పోలీస్ అధికారుల సంఘం ఉపాధ్యక్షురాలు స్వర్ణలత మాట్లాడుతూ, ఒకప్పుడు పోలీస్ గా, సంఘం సభ్యుడిగా పని చేసిన వర్ల రామయ్యకు పోలీస్ వ్యవస్థ ఎలా ఉంటుందో తెలియదా అని ప్రశ్నించారు. విలేకరుల సమావేశం నిర్వహించే అర్హత పోలీసుల సంఘానికి లేదన్న వర్ల,  ఎందుకు లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

మరోసారి రంగంలోకి దిగిన ధర్మాడి సత్యం... ఓ చిన్నారి కోసం అన్వేషణ!

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దీప్తిశ్రీ అనే ఏడేళ్ల చిన్నారి అదృశ్యం కావడం సంచలనం సృష్టించింది. దీప్తిశ్రీని  హత్యచేసి ఇంద్రపాలెం వద్ద ఉప్పుటేరులో పడవేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. అమె సవతి తల్లి శాంతకుమారి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని దీప్తిశ్రీ బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో కీలక సమాచారం అందజేసినట్టు తెలుస్తోంది. శాంతకుమారి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇంద్రపాలెం లాకుల వద్ద దీప్తిశ్రీ మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. అందుకోసం పోలీసులు ధర్మాడి సత్యం బృందం సాయం కోరారు. ఇటీవలే గోదావరి నదిలో బోటును వెలికితీసిన ధర్మాడి సత్యం ఓ చిన్నారి కోసం వెంటనే స్పందించారు. తన బృందంతో ఉప్పుటేరులో గాలింపు చేపట్టారు. అయితే, 30 గంటలు గడిచిన తర్వాతే మృతదేహం నీటిపై తేలుతుందని, ఈలోపు తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని ధర్మాడి సత్యం తెలిపారు.