Skip to main content

రిక్షావాలాను లక్షాధికారిని చేసిన 'వర్షం'!

అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ఎవరూ చెప్పలేరు! ఈ రిక్షావాలా విషయంలో అది నిజం అయింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన గౌర్ దాస్ వర్షం కారణంగా లాటరీలో రూ.50 లక్షలు గెలుచుకోవడం అదృష్టం కాక మరేంటి? గౌర్ దాస్ నాగాలాండ్ రాష్ట్రంలోని దిమాపూర్ లో రిక్షా తొక్కుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సెప్టెంబరు నెలాఖరులో ఇతర రిక్షావాలాలతో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

అయితే, విహారయాత్రకు వెళ్లే రోజున భారీ వర్షం కురిసింది. దాంతో ఆ యాత్ర క్యాన్సిల్ అయింది. రిక్షా యూనియన్ ఆఫీసు నుంచి ఇంటికి వస్తుండగా, లాటరీలు అమ్మే ఓ వ్యక్తి ఎదురొచ్చి లాటరీ కొనాలంటూ వెంటపడ్డాడు. లాటరీ విలువ రూ.30 మాత్రమే కావడంతో, సరేనని చెప్పి ఓ లాటరీ కొనుగోలు చేశాడు. వారం క్రితం లాటరీ ఫలితాలు రాగా, గౌర్ దాస్ కొన్న లాటరీ నంబర్ కు రూ.50 లక్షల బహుమతి వచ్చింది.

ఈ విషయం తెలిసి ఆ రిక్షావాలా ఆనందం అంతాఇంతా కాదు. అయితే, ఎవరికన్నా తెలిస్తే, ప్రమాదం అని భావించిన గౌర్ దాస్ కేవలం తన భార్యకు మాత్రమే లాటరీ గెలిచిన విషయం చెప్పాడు. అప్పటికప్పుడు ఆ లాటరీ సొమ్మును బ్యాంకులో డిపాజిట్ చేసి ఊపిరి పీల్చుకున్నాడు. అయితే, ఈ విషయం మీడియాలో రావడంతో అందరికీ తెలిసిపోయింది. మొత్తానికి వర్షం ఓ రిక్షావాలాను ధనవంతుడ్ని చేసింది. వర్షం పడకుండా ఉంటే, గౌర్ దాస్ పిక్నిక్ కు వెళ్లేవాడు, లాటరీ మిస్సయ్యేది! ఎవరినో వరించాల్సిన ఆ లాటరీ వర్షం కారణంగా వెతుక్కుంటూ ఆ రిక్షా వాలా చెంతకు చేరడం నిజంగా అదృష్టమే!

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...