Skip to main content

కమ్మరాజ్యంలో కడపరెడ్లు కథను పరిశీలించాకే సినిమా రిలీజ్ కు అనుమతివ్వాలి: బీజేపీ యువ మోర్చా




ఏదైనా సినిమాను క్షుణ్ణంగా పరిశీలించాకే విడుదలకు అంగీకరించాలని బీజేపీ యువమోర్చా సెన్సార్ బోర్డును కోరింది. ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ అన్న సినిమా  టైటిల్ ప్రజల్లో విద్వేషాలు పెంచేలా పెట్టారని వారు హైదరాబాద్ లోని స్థానిక సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు రమేష్ నాయుడు వివరాలను వెల్లడించారు. ఈ సినిమా టైటిల్ విద్వేషాలను ఎగదోసేలా ఉందని, టైటిల్ మార్చిన తర్వాతే దీని విడుదలకు అనుమతి ఇవ్వాలని బోర్డును కోరినట్లు తెలిపారు.

 సంచలనాలు, ఆదాయంకోసం ఇలాంటి పేర్లు పెడుతున్నారని, సినిమా పేరు మార్చకుంటే ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు. సామాజిక స్పృహ లేకుండా సినిమాలు తీయవద్దని నిర్మాతలకు సూచించారు. కాగా దర్శకుడు వర్మ తీస్తున్న ఇటీవలి చిత్రాలు ఎక్కువగా రాజకీయ నేపథ్యం ఉన్నవే కావడం గమనార్హం.  

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.