Skip to main content

భవిష్యత్ లో టీడీపీ టికెట్ అడిగే నాయకుడే ఉండరు- వైసీపీ ఎమ్మెల్యే ఎద్దేవా..


పాదయాత్రలో వై.యస్. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారని ఎమ్మెల్యే కాకాని గోవర్డన్ రెడ్డి అన్నారు.. మాట తప్పడం.. మడమ తిప్పడం తెలియని కుటుంబం వైఎస్సార్ కుటుంబమని ఆయన అన్నారు.నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండలం, విక్రమ సింహపురి యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
.జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గములో చారిత్రాత్మక ఘట్టాన్ని ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్నారన్నారు.నవరత్నాలలో ఒక పధకం వై.యస్.ఆర్. రైతుభరోసాని మా జిల్లాలో ప్రారంభించడంతో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు.ప్రధానంగా జిల్లాలో అన్ని జలాశయాలు జలకళతో ఉన్నాయనన్నారు.తిరిగి మహానేత వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారి పాలన ప్రారంభం అయింది అనడానికి జలాశయాలలో జలకళే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో అన్నీ వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్న ఆయన.. చంద్రబాబు ఒక్కరే బాధపడుతున్నాడని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు సుఖంగా, సంతోషంగా ఉంటే చంద్రబాబు చూడలేరని ఆయన విమర్శించారు.ఇక తెలుగుదేశం పార్టీని ఏ వర్గం వాళ్ళు నమ్మరని చంద్రబాబు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.రుణమాఫీ అని చంద్రబాబు గతంలో రైతులను మోసం చేశారాని గుర్తు చేశారు.రైతులు సంతోషంగా ఉండటం 
చంద్రబాబుకు ఇష్టం లేదని. అందుకే ఆయన కావాలనే వైయస్సార్సీపీ పై నిందలువేస్తున్నాడన్నారు..చంద్రబాబు ఉనికిని కాపాడుకునేందుకు జిల్లాలో రెండు రోజుల పర్యటన చేస్తున్నాడన్నారు.
చంద్రబాబు ఎన్ని పర్యటనలు చేసినా. ఆయన్నీ నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని వెల్లడించారు.రానున్న రోజులలో తెలుగుదేశంకు టికెట్ అడిగే వారు కూడా ఉండరంటూ ఎద్దేవా చేశారు.

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...