Skip to main content

భవిష్యత్ లో టీడీపీ టికెట్ అడిగే నాయకుడే ఉండరు- వైసీపీ ఎమ్మెల్యే ఎద్దేవా..


పాదయాత్రలో వై.యస్. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారని ఎమ్మెల్యే కాకాని గోవర్డన్ రెడ్డి అన్నారు.. మాట తప్పడం.. మడమ తిప్పడం తెలియని కుటుంబం వైఎస్సార్ కుటుంబమని ఆయన అన్నారు.నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండలం, విక్రమ సింహపురి యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
.జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గములో చారిత్రాత్మక ఘట్టాన్ని ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్నారన్నారు.నవరత్నాలలో ఒక పధకం వై.యస్.ఆర్. రైతుభరోసాని మా జిల్లాలో ప్రారంభించడంతో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు.ప్రధానంగా జిల్లాలో అన్ని జలాశయాలు జలకళతో ఉన్నాయనన్నారు.తిరిగి మహానేత వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారి పాలన ప్రారంభం అయింది అనడానికి జలాశయాలలో జలకళే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో అన్నీ వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్న ఆయన.. చంద్రబాబు ఒక్కరే బాధపడుతున్నాడని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు సుఖంగా, సంతోషంగా ఉంటే చంద్రబాబు చూడలేరని ఆయన విమర్శించారు.ఇక తెలుగుదేశం పార్టీని ఏ వర్గం వాళ్ళు నమ్మరని చంద్రబాబు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.రుణమాఫీ అని చంద్రబాబు గతంలో రైతులను మోసం చేశారాని గుర్తు చేశారు.రైతులు సంతోషంగా ఉండటం 
చంద్రబాబుకు ఇష్టం లేదని. అందుకే ఆయన కావాలనే వైయస్సార్సీపీ పై నిందలువేస్తున్నాడన్నారు..చంద్రబాబు ఉనికిని కాపాడుకునేందుకు జిల్లాలో రెండు రోజుల పర్యటన చేస్తున్నాడన్నారు.
చంద్రబాబు ఎన్ని పర్యటనలు చేసినా. ఆయన్నీ నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని వెల్లడించారు.రానున్న రోజులలో తెలుగుదేశంకు టికెట్ అడిగే వారు కూడా ఉండరంటూ ఎద్దేవా చేశారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...