Skip to main content

భవిష్యత్ లో టీడీపీ టికెట్ అడిగే నాయకుడే ఉండరు- వైసీపీ ఎమ్మెల్యే ఎద్దేవా..


పాదయాత్రలో వై.యస్. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారని ఎమ్మెల్యే కాకాని గోవర్డన్ రెడ్డి అన్నారు.. మాట తప్పడం.. మడమ తిప్పడం తెలియని కుటుంబం వైఎస్సార్ కుటుంబమని ఆయన అన్నారు.నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండలం, విక్రమ సింహపురి యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
.జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గములో చారిత్రాత్మక ఘట్టాన్ని ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్నారన్నారు.నవరత్నాలలో ఒక పధకం వై.యస్.ఆర్. రైతుభరోసాని మా జిల్లాలో ప్రారంభించడంతో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు.ప్రధానంగా జిల్లాలో అన్ని జలాశయాలు జలకళతో ఉన్నాయనన్నారు.తిరిగి మహానేత వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారి పాలన ప్రారంభం అయింది అనడానికి జలాశయాలలో జలకళే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో అన్నీ వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్న ఆయన.. చంద్రబాబు ఒక్కరే బాధపడుతున్నాడని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు సుఖంగా, సంతోషంగా ఉంటే చంద్రబాబు చూడలేరని ఆయన విమర్శించారు.ఇక తెలుగుదేశం పార్టీని ఏ వర్గం వాళ్ళు నమ్మరని చంద్రబాబు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.రుణమాఫీ అని చంద్రబాబు గతంలో రైతులను మోసం చేశారాని గుర్తు చేశారు.రైతులు సంతోషంగా ఉండటం 
చంద్రబాబుకు ఇష్టం లేదని. అందుకే ఆయన కావాలనే వైయస్సార్సీపీ పై నిందలువేస్తున్నాడన్నారు..చంద్రబాబు ఉనికిని కాపాడుకునేందుకు జిల్లాలో రెండు రోజుల పర్యటన చేస్తున్నాడన్నారు.
చంద్రబాబు ఎన్ని పర్యటనలు చేసినా. ఆయన్నీ నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని వెల్లడించారు.రానున్న రోజులలో తెలుగుదేశంకు టికెట్ అడిగే వారు కూడా ఉండరంటూ ఎద్దేవా చేశారు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...