Skip to main content

దగ్గుబాటి షాకింగ్ నిర్ణయం.. వైసీపీకి రాజీనామా?

 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. జగన్ ను కలవడం, ఆయనతో మాట్లాడటం ఇష్టంలేని దగ్గుబాటి, పార్టీలోని మరో కీలక నేతకు ఈ విషయాన్ని చెప్పినట్టు సమాచారం. ఇదే సమయంలో తన భార్య పురందేశ్వరి బీజేపీలో క్రియాశీలకంగా ఉన్నందున, తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆయన వెల్లడించినట్టు తెలుస్తోంది.

ఈ సంవత్సరం జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ హవా వీచి, ఆ పార్టీ ఘన విజయం సాధించినప్పటికీ, దగ్గుబాటి మాత్రం విజయం సాధించలేకపోయారు. ఆపై భార్యాభర్తలిద్దరూ ఒకే పార్టీలో ఉండాలని జగన్ అల్టిమేటం జారీ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఆపై రెండు రోజుల క్రితం దగ్గుబాటి తన కార్యకర్తలతోనూ సమావేశమై, వైసీపీకి రాజీనామా చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. దగ్గుబాటి రాజీనామాపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. పర్చూరు నియోజకవర్గంలో రామనాథం బాబును పార్టీలోకి తీసుకోవడం కూడా దగ్గుబాటికి ఆగ్రహం తెప్పించిందని ఆయన అనుచరులు అంటున్నారు.   

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...