Skip to main content

దగ్గుబాటి షాకింగ్ నిర్ణయం.. వైసీపీకి రాజీనామా?

 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. జగన్ ను కలవడం, ఆయనతో మాట్లాడటం ఇష్టంలేని దగ్గుబాటి, పార్టీలోని మరో కీలక నేతకు ఈ విషయాన్ని చెప్పినట్టు సమాచారం. ఇదే సమయంలో తన భార్య పురందేశ్వరి బీజేపీలో క్రియాశీలకంగా ఉన్నందున, తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆయన వెల్లడించినట్టు తెలుస్తోంది.

ఈ సంవత్సరం జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ హవా వీచి, ఆ పార్టీ ఘన విజయం సాధించినప్పటికీ, దగ్గుబాటి మాత్రం విజయం సాధించలేకపోయారు. ఆపై భార్యాభర్తలిద్దరూ ఒకే పార్టీలో ఉండాలని జగన్ అల్టిమేటం జారీ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఆపై రెండు రోజుల క్రితం దగ్గుబాటి తన కార్యకర్తలతోనూ సమావేశమై, వైసీపీకి రాజీనామా చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. దగ్గుబాటి రాజీనామాపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. పర్చూరు నియోజకవర్గంలో రామనాథం బాబును పార్టీలోకి తీసుకోవడం కూడా దగ్గుబాటికి ఆగ్రహం తెప్పించిందని ఆయన అనుచరులు అంటున్నారు.   

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.