Skip to main content

ఆర్టీసీ సమ్మె వ్యవహారం.. అధికారులతో కేసీఆర్ అత్యవసర సమావేశం



తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాల్చింది. అధికారులతో యూనియన్ నేతలు జరిపిన చర్చలు కూడా విఫలమయ్యాయి. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాల్సిందేనని కార్మికులు పట్టుబడుతుండగా... ప్రభుత్వం ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో ఈ మధ్యాహ్నం ఆర్టీసీ సమ్మె వ్యవహారంపై హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. దీంతో, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీకి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్, అడ్వొకేట్ జనరల్, కీలక అధికారులు హాజరయ్యారు. కోర్టుకు అందించాల్సిన నివేదికపై వీరికి ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలను హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ వినిపించనున్నారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.