Skip to main content

ఆర్టీసీ సమ్మె వ్యవహారం.. అధికారులతో కేసీఆర్ అత్యవసర సమావేశం



తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాల్చింది. అధికారులతో యూనియన్ నేతలు జరిపిన చర్చలు కూడా విఫలమయ్యాయి. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాల్సిందేనని కార్మికులు పట్టుబడుతుండగా... ప్రభుత్వం ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో ఈ మధ్యాహ్నం ఆర్టీసీ సమ్మె వ్యవహారంపై హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. దీంతో, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీకి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్, అడ్వొకేట్ జనరల్, కీలక అధికారులు హాజరయ్యారు. కోర్టుకు అందించాల్సిన నివేదికపై వీరికి ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలను హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ వినిపించనున్నారు.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.