Skip to main content

మరో రికార్డును కొట్టిన విరాట్ కోహ్లీ!


 
భారత పరుగుల రారాజు విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు ఒదిగిపోయింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో కోహ్లీ డబుల్ సెంచరీ సాధించాడు. ఈ ఢిల్లీ డైనమైట్ కు ఇది 7వ డబుల్ సెంచరీ. తద్వారా భారత్ తరఫున అత్యధిక ద్విశతకాలు సాధించిన బ్యాట్స్ మన్ గా కోహ్లీ రికార్డుల పుటల్లోకెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు విధ్వంసక వీరుడు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. వీరూ 6 డబుల్ సెంచరీల రికార్డును ఢిల్లీకే చెందిన కోహ్లీ బద్దలు కొట్టడం విశేషం.

అంతేకాదు, ప్రపంచ క్రికెట్ లో అత్యధిక డబుల్ సెంచరీల జాబితాలో నాలుగోస్థానానికి ఎగబాకాడు. కేవలం 81 టెస్టుల్లోనే కోహ్లీ ఈ రికార్డు అందుకున్నాడు. ఈ జాబితాలో ఎవరికీ అందనంత ఎత్తులో ఆసీస్ క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్ మన్ (52 టెస్టులు) ఉన్నాడు. డాన్ ఖాతాలో 12 డబుల్స్ ఉన్నాయి. ఆ తర్వాత శ్రీలంక లెజెండ్ కుమార సంగక్కర (134 టెస్టులు) 11 ద్విశతకాలతో రెండో స్థానంలోను, 9 డబుల్ సెంచరీలతో వెస్టిండీస్ బ్యాటింగ్ కింగ్ బ్రియాన్ లారా (131 టెస్టులు) మూడో స్థానంలోను ఉన్నారు.

ఇక, దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో కోహ్లీ మరో ఘనత కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో 7000 పరుగులు సాధించాడు. ఏడు వేల పరుగుల మైలురాయిని ఓ డబుల్ సెంచరీతో సాకారం చేసుకున్న తొలి బ్యాట్స్ మన్ కోహ్లీనే!

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...