Skip to main content

మరో రికార్డును కొట్టిన విరాట్ కోహ్లీ!


 
భారత పరుగుల రారాజు విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు ఒదిగిపోయింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో కోహ్లీ డబుల్ సెంచరీ సాధించాడు. ఈ ఢిల్లీ డైనమైట్ కు ఇది 7వ డబుల్ సెంచరీ. తద్వారా భారత్ తరఫున అత్యధిక ద్విశతకాలు సాధించిన బ్యాట్స్ మన్ గా కోహ్లీ రికార్డుల పుటల్లోకెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు విధ్వంసక వీరుడు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. వీరూ 6 డబుల్ సెంచరీల రికార్డును ఢిల్లీకే చెందిన కోహ్లీ బద్దలు కొట్టడం విశేషం.

అంతేకాదు, ప్రపంచ క్రికెట్ లో అత్యధిక డబుల్ సెంచరీల జాబితాలో నాలుగోస్థానానికి ఎగబాకాడు. కేవలం 81 టెస్టుల్లోనే కోహ్లీ ఈ రికార్డు అందుకున్నాడు. ఈ జాబితాలో ఎవరికీ అందనంత ఎత్తులో ఆసీస్ క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్ మన్ (52 టెస్టులు) ఉన్నాడు. డాన్ ఖాతాలో 12 డబుల్స్ ఉన్నాయి. ఆ తర్వాత శ్రీలంక లెజెండ్ కుమార సంగక్కర (134 టెస్టులు) 11 ద్విశతకాలతో రెండో స్థానంలోను, 9 డబుల్ సెంచరీలతో వెస్టిండీస్ బ్యాటింగ్ కింగ్ బ్రియాన్ లారా (131 టెస్టులు) మూడో స్థానంలోను ఉన్నారు.

ఇక, దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో కోహ్లీ మరో ఘనత కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో 7000 పరుగులు సాధించాడు. ఏడు వేల పరుగుల మైలురాయిని ఓ డబుల్ సెంచరీతో సాకారం చేసుకున్న తొలి బ్యాట్స్ మన్ కోహ్లీనే!

Comments

Popular posts from this blog

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.