Skip to main content

సరిహద్దుల్లో జవాన్లతో కలిసి దీపావళి జరుపుకున్న ప్రధాని మోదీ


 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీపావళి వేడుకలను సరిహద్దుల్లో జరుపుకున్నారు. జమ్మూకశ్మీర్ లోని సరిహద్దు జిల్లా రాజౌరి వెళ్లిన ఆయన అక్కడి సైనికులతో దీపావళి సంబరాలు చేసుకున్నారు. సైనిక దుస్తుల్లో కనిపించిన మోదీ జవాన్లకు మిఠాయిలు పంచిపెట్టారు. స్వయంగా ఆయన వారికి తినిపించారు. సైనికులతో ఉల్లాసంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా మోదీ వెంట ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, ఇతర సైనికాధికారులు ఉన్నారు. మోదీ రాజౌరి రాకకు కొద్ది ముందు పాకిస్థాన్ వైపు నుంచి సైనిక పోస్టులపై గుళ్ల వర్షం కురిసింది. ఈ దాడులను భారత బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...