Skip to main content

సరిహద్దుల్లో జవాన్లతో కలిసి దీపావళి జరుపుకున్న ప్రధాని మోదీ


 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీపావళి వేడుకలను సరిహద్దుల్లో జరుపుకున్నారు. జమ్మూకశ్మీర్ లోని సరిహద్దు జిల్లా రాజౌరి వెళ్లిన ఆయన అక్కడి సైనికులతో దీపావళి సంబరాలు చేసుకున్నారు. సైనిక దుస్తుల్లో కనిపించిన మోదీ జవాన్లకు మిఠాయిలు పంచిపెట్టారు. స్వయంగా ఆయన వారికి తినిపించారు. సైనికులతో ఉల్లాసంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా మోదీ వెంట ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, ఇతర సైనికాధికారులు ఉన్నారు. మోదీ రాజౌరి రాకకు కొద్ది ముందు పాకిస్థాన్ వైపు నుంచి సైనిక పోస్టులపై గుళ్ల వర్షం కురిసింది. ఈ దాడులను భారత బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.