ఉపాధి హామీ పెండింగ్ బిల్లులపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఏపీకి రావాల్సిన ఉపాధి హామీ పెండింగ్ బిల్లుల చెల్లింపులు చేయాలని లేఖలో కోరారు. ఉపాధి హామీ పథకాన్ని 2014-19 మధ్య కాలంలో ఏపీ ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహించిందని చెప్పారు. రూ. 1,845 కోట్ల పెండింగ్ బిల్లులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినా... దానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను ఇంకా జోడించలేదని పేర్కొన్నారు. ఉపాధిహామీ పథకం నియమనిబంధనలకు వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. పెండింగ్ బిల్లులను చెల్లించడం లేదని, నిధులను దారి మళ్లిస్తోందని తెలిపారు.
నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.
Comments
Post a Comment