Skip to main content

బీజేపీ ఎంపీ మూర్ముకు షాకిచ్చిన అమెజాన్

 
 


పశ్చిమబెంగాల్ మాల్దా నార్త్ లోక్ సభ నియోజకవర్గ ఎంపీ ఖాజెన్ మూర్ముకు అమెజాన్ షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే, మూర్ము తన కుమారుడి చేత ఆన్ లైన్లో శాంసంగ్ ఫోన్ ను బుక్ చేయించారు. అమెజాన్ నుంచి వారి ఇంటికి పార్సిల్ డెలివరీ అయింది. అయితే పార్సిల్ ను ఓపెన్ చేసిన వారికి షాక్ తగిలింది. తాము శాంసంగ్ ఫోన్ ఆర్డ్ చేస్తే రెడ్ మీ 5ఏ బాక్స్ వచ్చింది. సరే అని దాన్ని కాస్తా ఓపెన్ చేశారు. ఇక్కడ వారికి మరో షాక్ తగిలింది. ఫోన్ లో మొబైల్ స్థానంలో రాళ్లు కనిపించాయి. నిశ్చేష్టుడైన మూర్ము వెంటనే అమెజాన్ కు ఫిర్యాదు చేశారు.  

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.