Skip to main content

బీజేపీ ఎంపీ మూర్ముకు షాకిచ్చిన అమెజాన్

 
 


పశ్చిమబెంగాల్ మాల్దా నార్త్ లోక్ సభ నియోజకవర్గ ఎంపీ ఖాజెన్ మూర్ముకు అమెజాన్ షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే, మూర్ము తన కుమారుడి చేత ఆన్ లైన్లో శాంసంగ్ ఫోన్ ను బుక్ చేయించారు. అమెజాన్ నుంచి వారి ఇంటికి పార్సిల్ డెలివరీ అయింది. అయితే పార్సిల్ ను ఓపెన్ చేసిన వారికి షాక్ తగిలింది. తాము శాంసంగ్ ఫోన్ ఆర్డ్ చేస్తే రెడ్ మీ 5ఏ బాక్స్ వచ్చింది. సరే అని దాన్ని కాస్తా ఓపెన్ చేశారు. ఇక్కడ వారికి మరో షాక్ తగిలింది. ఫోన్ లో మొబైల్ స్థానంలో రాళ్లు కనిపించాయి. నిశ్చేష్టుడైన మూర్ము వెంటనే అమెజాన్ కు ఫిర్యాదు చేశారు.  

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...