Skip to main content

ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టండి: మోదీ

 
ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టండి: మోదీ
రియాద్‌ (సౌదీ అరేబియా): భారత్‌లో ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టాలని ప్రధాని మోదీ సౌదీకి చెందిన సంస్థలకు పిలుపునిచ్చారు. ఈ రంగంలో ప్రభుత్వం 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనుందని తెలిపారు. ప్రస్తుతం సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న మోదీ రియాద్‌లో జరిగిన భవిష్యత్‌ పెట్టుబడుల ఆరంభ సదస్సు (ఎఫ్‌ఐఐ) 2019లో పాల్గొని ప్రసంగించారు. రాబోయే ఐదేళ్లలో భారత్‌ 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందన్న మోదీ.. మౌలిక వసతుల రంగంలోనూ భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు విస్తృత అవకాశాలున్నాయని చెప్పారు. ఒక్క ఈ రంగంలోనే రాబోయే ఐదేళ్లలో 1.5 ట్రిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు. 
దేశంలో వ్యాపార అనుకూల వాతావరణం ఏర్పర్చేందుకు తమ ప్రభుత్వం తీసుకున్న విధానాలను మోదీ వివరించారు. ఈ నేపథ్యంలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌, ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌, లాజిస్టిక్‌ పర్ఫార్మెన్స్‌లో తమకు ప్రపంచ బ్యాంకు ఇచ్చిన ర్యాంకింగ్‌లను ప్రస్తావించారు. అంతేకాక దేశంలోని 400 విలియన్ల యువతకు రాబోయే 3-4 ఏళ్లలో నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. 
‘‘2024 కల్లా చమురు రిఫైనింగ్‌, పైపు లైన్లు, గ్యాస్‌ టెర్మినల్స్‌ తదితర రంగాల్లో 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టే లక్ష్యంతో ఉన్నాం. సౌదీకి చెందిన ఆరామ్‌కో సంస్థ వెస్ట్‌కోస్ట్‌ రిఫైనరీ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ రిఫైనరీ ప్రాజెక్టు ఆసియాలోనే అతి పెద్దది’’  అని మోదీ వివరించారు.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...