Skip to main content

ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టండి: మోదీ

 
ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టండి: మోదీ
రియాద్‌ (సౌదీ అరేబియా): భారత్‌లో ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టాలని ప్రధాని మోదీ సౌదీకి చెందిన సంస్థలకు పిలుపునిచ్చారు. ఈ రంగంలో ప్రభుత్వం 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనుందని తెలిపారు. ప్రస్తుతం సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న మోదీ రియాద్‌లో జరిగిన భవిష్యత్‌ పెట్టుబడుల ఆరంభ సదస్సు (ఎఫ్‌ఐఐ) 2019లో పాల్గొని ప్రసంగించారు. రాబోయే ఐదేళ్లలో భారత్‌ 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందన్న మోదీ.. మౌలిక వసతుల రంగంలోనూ భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు విస్తృత అవకాశాలున్నాయని చెప్పారు. ఒక్క ఈ రంగంలోనే రాబోయే ఐదేళ్లలో 1.5 ట్రిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు. 
దేశంలో వ్యాపార అనుకూల వాతావరణం ఏర్పర్చేందుకు తమ ప్రభుత్వం తీసుకున్న విధానాలను మోదీ వివరించారు. ఈ నేపథ్యంలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌, ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌, లాజిస్టిక్‌ పర్ఫార్మెన్స్‌లో తమకు ప్రపంచ బ్యాంకు ఇచ్చిన ర్యాంకింగ్‌లను ప్రస్తావించారు. అంతేకాక దేశంలోని 400 విలియన్ల యువతకు రాబోయే 3-4 ఏళ్లలో నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. 
‘‘2024 కల్లా చమురు రిఫైనింగ్‌, పైపు లైన్లు, గ్యాస్‌ టెర్మినల్స్‌ తదితర రంగాల్లో 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టే లక్ష్యంతో ఉన్నాం. సౌదీకి చెందిన ఆరామ్‌కో సంస్థ వెస్ట్‌కోస్ట్‌ రిఫైనరీ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ రిఫైనరీ ప్రాజెక్టు ఆసియాలోనే అతి పెద్దది’’  అని మోదీ వివరించారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.