Skip to main content

ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టండి: మోదీ

 
ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టండి: మోదీ
రియాద్‌ (సౌదీ అరేబియా): భారత్‌లో ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టాలని ప్రధాని మోదీ సౌదీకి చెందిన సంస్థలకు పిలుపునిచ్చారు. ఈ రంగంలో ప్రభుత్వం 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనుందని తెలిపారు. ప్రస్తుతం సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న మోదీ రియాద్‌లో జరిగిన భవిష్యత్‌ పెట్టుబడుల ఆరంభ సదస్సు (ఎఫ్‌ఐఐ) 2019లో పాల్గొని ప్రసంగించారు. రాబోయే ఐదేళ్లలో భారత్‌ 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందన్న మోదీ.. మౌలిక వసతుల రంగంలోనూ భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు విస్తృత అవకాశాలున్నాయని చెప్పారు. ఒక్క ఈ రంగంలోనే రాబోయే ఐదేళ్లలో 1.5 ట్రిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు. 
దేశంలో వ్యాపార అనుకూల వాతావరణం ఏర్పర్చేందుకు తమ ప్రభుత్వం తీసుకున్న విధానాలను మోదీ వివరించారు. ఈ నేపథ్యంలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌, ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌, లాజిస్టిక్‌ పర్ఫార్మెన్స్‌లో తమకు ప్రపంచ బ్యాంకు ఇచ్చిన ర్యాంకింగ్‌లను ప్రస్తావించారు. అంతేకాక దేశంలోని 400 విలియన్ల యువతకు రాబోయే 3-4 ఏళ్లలో నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. 
‘‘2024 కల్లా చమురు రిఫైనింగ్‌, పైపు లైన్లు, గ్యాస్‌ టెర్మినల్స్‌ తదితర రంగాల్లో 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టే లక్ష్యంతో ఉన్నాం. సౌదీకి చెందిన ఆరామ్‌కో సంస్థ వెస్ట్‌కోస్ట్‌ రిఫైనరీ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ రిఫైనరీ ప్రాజెక్టు ఆసియాలోనే అతి పెద్దది’’  అని మోదీ వివరించారు.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

మరోసారి రంగంలోకి దిగిన ధర్మాడి సత్యం... ఓ చిన్నారి కోసం అన్వేషణ!

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దీప్తిశ్రీ అనే ఏడేళ్ల చిన్నారి అదృశ్యం కావడం సంచలనం సృష్టించింది. దీప్తిశ్రీని  హత్యచేసి ఇంద్రపాలెం వద్ద ఉప్పుటేరులో పడవేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. అమె సవతి తల్లి శాంతకుమారి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని దీప్తిశ్రీ బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో కీలక సమాచారం అందజేసినట్టు తెలుస్తోంది. శాంతకుమారి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇంద్రపాలెం లాకుల వద్ద దీప్తిశ్రీ మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. అందుకోసం పోలీసులు ధర్మాడి సత్యం బృందం సాయం కోరారు. ఇటీవలే గోదావరి నదిలో బోటును వెలికితీసిన ధర్మాడి సత్యం ఓ చిన్నారి కోసం వెంటనే స్పందించారు. తన బృందంతో ఉప్పుటేరులో గాలింపు చేపట్టారు. అయితే, 30 గంటలు గడిచిన తర్వాతే మృతదేహం నీటిపై తేలుతుందని, ఈలోపు తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని ధర్మాడి సత్యం తెలిపారు.