Skip to main content

ఆర్టీసీలో సమ్మె ఉదృతం.సమ్మె ఆపాలని హైకోర్టులో పిల్.!

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ప్రయాణికుల సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని..సమ్మె విరమించేలా చర్యలు తీసుకోవాలని పిల్‌లో కోరారు. అలాగే, ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కమిటీ వేయాలని పిల్ వేసిన పిటిషనర్ కోరారు.సాయంత్రం 4 గంటలకు హౌస్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు హైకోర్టు అనుమతించింది.అందువల్ల హైకోర్టు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.


ఓవైపు ప్రభుత్వం ఆల్రెడీ ఈ సమ్మెపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఎట్టిపరిస్థితుల్లో సమ్మెను సమర్థించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టింది. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులు సైతం... సమ్మె విషయంలో వెనక్కి తగ్గేది లేదంటున్నారు.
తమ ఉద్యోగాలు ఊడిపోయినా సరే..తమ పోరాటం ఆగదంటున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను సానుకూల దృక్పథంతో ఒప్పుకోవాలని కోరుతున్నారు.ఇక తెలంగాణలో ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె వరుసగా రెండో రోజూ కొనసాగుతోంది. దీంతో పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లేవారు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఇదే అదునుగా ప్రయివేట్ ట్రావెల్స్ జనాలను నిలువుదోపిడీ చేస్తున్నాయి. హైదరాబాద్‌ నగరం నుంచి స్వస్థలాలకు వెళ్లేవారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆర్టీసీ బస్సులో రూ.50 ఛార్జీతో వెళ్లే ప్రాంతాలకు ఇప్పుడు రూ.500 నుంచి రూ.700 వరకు ప్రయివేట్ ఆపరేటర్లు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ ఉద్యోగులు విధులకు హాజరుకాకపోవడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.పోలీసుల భద్రత నడుమ తాత్కాలిక డ్రైవర్ల సాయంతో పరిమిత సంఖ్యలో వాహనాలను నడుపుతున్నారు. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా.. అవి సరిపోవడం లేదు.
దాదాపు 50 వేలకు పైగా ఉద్యోగుల్లో ప్రభుత్వం ఇచ్చిన గడువులోపు శనివారం కేవలం 160 మంది ఉద్యోగులు మాత్రమే విధుల్లో చేరారు.ఇకపోతే ఈ రోజు అంటే ఆదివారం ఉదయం సమ్మె ఉదృతం కాగా, కనీసం నిన్న నడిచినన్ని బస్సులు కూడా నేడు కనిపించడం లేదు. రెండో రోజు వినూత్నంగా నిరసన తెలపాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించారు. డిపోల ఎదుట కుటుంబాలతో కలిసి సాయంత్రం బతుకమ్మ ఆడనున్నారు. అక్టోబరు 7న గన్‌పార్క్ వద్ద అమరులకు నివాళులర్పించి, ఇందిరా పార్కు వద్ద 15 మంది వరకు ఆమరణ నిరాహార దీక్షకు దిగనున్నారట....

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...