Skip to main content

ఆర్టీసీలో సమ్మె ఉదృతం.సమ్మె ఆపాలని హైకోర్టులో పిల్.!

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ప్రయాణికుల సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని..సమ్మె విరమించేలా చర్యలు తీసుకోవాలని పిల్‌లో కోరారు. అలాగే, ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కమిటీ వేయాలని పిల్ వేసిన పిటిషనర్ కోరారు.సాయంత్రం 4 గంటలకు హౌస్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు హైకోర్టు అనుమతించింది.అందువల్ల హైకోర్టు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.


ఓవైపు ప్రభుత్వం ఆల్రెడీ ఈ సమ్మెపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఎట్టిపరిస్థితుల్లో సమ్మెను సమర్థించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టింది. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులు సైతం... సమ్మె విషయంలో వెనక్కి తగ్గేది లేదంటున్నారు.
తమ ఉద్యోగాలు ఊడిపోయినా సరే..తమ పోరాటం ఆగదంటున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను సానుకూల దృక్పథంతో ఒప్పుకోవాలని కోరుతున్నారు.ఇక తెలంగాణలో ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె వరుసగా రెండో రోజూ కొనసాగుతోంది. దీంతో పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లేవారు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఇదే అదునుగా ప్రయివేట్ ట్రావెల్స్ జనాలను నిలువుదోపిడీ చేస్తున్నాయి. హైదరాబాద్‌ నగరం నుంచి స్వస్థలాలకు వెళ్లేవారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆర్టీసీ బస్సులో రూ.50 ఛార్జీతో వెళ్లే ప్రాంతాలకు ఇప్పుడు రూ.500 నుంచి రూ.700 వరకు ప్రయివేట్ ఆపరేటర్లు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ ఉద్యోగులు విధులకు హాజరుకాకపోవడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.పోలీసుల భద్రత నడుమ తాత్కాలిక డ్రైవర్ల సాయంతో పరిమిత సంఖ్యలో వాహనాలను నడుపుతున్నారు. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా.. అవి సరిపోవడం లేదు.
దాదాపు 50 వేలకు పైగా ఉద్యోగుల్లో ప్రభుత్వం ఇచ్చిన గడువులోపు శనివారం కేవలం 160 మంది ఉద్యోగులు మాత్రమే విధుల్లో చేరారు.ఇకపోతే ఈ రోజు అంటే ఆదివారం ఉదయం సమ్మె ఉదృతం కాగా, కనీసం నిన్న నడిచినన్ని బస్సులు కూడా నేడు కనిపించడం లేదు. రెండో రోజు వినూత్నంగా నిరసన తెలపాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించారు. డిపోల ఎదుట కుటుంబాలతో కలిసి సాయంత్రం బతుకమ్మ ఆడనున్నారు. అక్టోబరు 7న గన్‌పార్క్ వద్ద అమరులకు నివాళులర్పించి, ఇందిరా పార్కు వద్ద 15 మంది వరకు ఆమరణ నిరాహార దీక్షకు దిగనున్నారట....

Comments

Popular posts from this blog

ఎలన్ మస్క్... స్టార్ షిప్ రెడీ... వచ్చే ఏడాది మార్స్ చెంతకు ప్రయాణం

మార్స్ గ్రహంపైకి వన్ వే ట్రిప్‌గా ఆసక్తి ఉన్న ప్రజలను పంపుతానని ప్రకటించిన ఆమెరికా బిలియనీర్ వ్యాపారి ఎలన్ మస్క్... అన్నంత పనీ చేస్తున్నారు. మనుషుల్ని చందమామ, మార్స్ చెంతకు తీసుకెళ్లడం కోసం ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్... సరికొత్త విమానం తరహా స్పేస్ షిప్‌లను తయారుచేస్తోంది. ఇవి రాకెట్‌‌లా కాకుండా... విమానం లాగా... అంతరిక్షంలోకి వెళ్లి... గ్రహాలపై మనుషుల్ని దించేసి... తిరిగి ఖాళీగా వెనక్కి వచ్చేస్తాయి. గ్రహాలపైకి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చే అవకాశాలు లేవు. ఇందుకు రిటర్న్ ట్రిప్ అవకాశం కల్పించట్లేదు ఎలన్ మస్క్. వన్ వే ట్రిప్‌గా వెళ్లేందుకు ఆసక్తి ఉన్నవారే టికెట్ బుక్ చేసుకోమని సూచిస్తున్నారు. తాజాగా ఆయన ఆవిష్కరించిన స్పేస్‌షిప్‌లో వంద మంది ప్రయాణించేందుకు వీలుంది. టెక్సాస్... బోకా చికాలో... ఎంతో మంది అంతరిక్ష ఔత్సాహికులు, రిపోర్టర్ల సమక్షంలో చందమామ, మార్స్‌పైకి పంపే స్టార్ షిప్‌ను ఆవిష్కరించారు ఎలన్ మస్క్. వచ్చే ఆరు నెలల్లో దాన్ని అంతరిక్షంలో ఓ రౌండ్ వేయించి... వచ్చే ఏడాది మనుషులను అందులో పంపాలనుకుంటున్నారు ఎలన్ మస్క్. ఎప్పుడో పదకొండు ఏళ్ల కిందట ఫాల్కన్-1 రాకెట్‌ను తయారుచేసింది స్పేస్ ఎక...

క్రెడిట్ పై పెట్రోలును కొనుగోలు చేస్తే నో క్యాష్‌బ్యాక్‌

క్రెడిట్‌ కార్డులను వినియోగించి పెట్రోలును కొనుగోలు చేస్తే ఇన్నాళ్లూ లభిస్తున్న 0.75 శాతం క్యాష్‌బ్యాక్‌ అక్టోబరు ఒకటో తేది నుంచి ఉండబోదని కంపెనీలు ప్ర‌క‌టించాయి.  2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే డిస్కౌంట్‌ ఇవ్వాలని చమురు కంపెనీలను కోరింది. దీంతో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి  2016 డిసెంబరు నుంచి క్రెడిట్‌, డెబిట్‌, ఈ-వాలెట్ల ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేసే వారికి 0.75శాతం డిస్కౌంట్‌ను క్యాష్‌బ్యాక్‌ రూపంలో  ఇవ్వాల‌ని  చమురు కంపెనీలు క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించిన విష‌యం తెలిసిందే. కాగా వచ్చే నెల ఒకటో తేది నుంచి ఆ డిస్కౌంట్‌ ఉండబోదని తాజాగా కంపెనీలు వెల్లడించాయి. ఇకమీదట డెబిట్‌, ఇతర డిజిటల్‌ పద్ధతుల ద్వారా చెల్లించేవారికి మాత్రం ఈ డిస్కౌంట్‌ యధావిధిగా కొనసాగుతుంది.