Skip to main content

జగన్ సంచలన నిర్ణయాలు.సంకట స్థితిలో సీఎం కేసీఆర్

ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు దేశ వ్యాప్తంగా కొత్త సంచలనాలకు దారితీస్తున్నాయి. ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా జగన్ ను ఫాలో అవుతున్నారు. ప్రధానంగా పోలవరం రివర్స్ టెండరింగ్, పీపీఏల పున: పరశీలించడం లాంటి నిర్ణయాలను అమలు చేయడానికి మిగితా రాష్ట్రాలు పూనుకుంటున్నాయి.ఇతర రాష్ట్రాల పరిస్థితి ఏమో గాని జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల పొరుగు రాష్ట్రం తెలంగాణా సీఎం కేసీఆర్ ను చిక్కుల్లోకి నెడుతున్నాయి.
ఆర్థిక లోటుతో సతమతమవుతున్నా జగన్ ఇచ్చిన హామీలను ఒక్కక్కటిగా నెరవేరుస్తున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అంశం ఇందులో ప్రధానమైనది. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రికి సాధ్యంకాని పనిని చేసి చూపించారు. ఎన్నికలకు ముందు ఆర్టీసీ ఉద్యోగులకు తాను హామీ ఇచ్చిన విధంగా వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు ఏపీ సర్కార్ చర్యలు తీసుకుంటోంది.ఆర్టీసి విలీనానికి తోడు తాజాగా ఉద్యోగుల పదవీ విరమణ వయసును ప్రభుత్వం ఉద్యోగులతో సమానంగా 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తుంటే…గన్ తీసుకున్న తాజా నిర్ణయం తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మరింత ఇబ్బందిగా మారిందనే ప్రచారం సాగుతోంది. ఏపీలో మాదిరగానే తెలంగాణాలో కూడా ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోతే ఈ నెల 5 నుంచి సమ్మె చేస్తామని ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వానికి అల్టిమేటం కూడా జారీ చేశారు. అసలే దరసా కావడంతో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణం తీసుకుంటారోనని రాజకీయ వర్గాల్లో చర్చజరుగుతోంది.
ఏపీలోని ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతూ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఈ విషయంలో మరింత ఒత్తిడి పెరిగినట్టయ్యిందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.అప్పుల్లో ఉన్న ఏపీ రాష్ట్రం ఆర్టీసీ ఉద్యోగులకు ఎంతో మేలు చేస్తుంటే… ధనిక రాష్ట్రమని చెప్పుకునే తెలంగాణలో మాత్రం తమకు అన్యాయం జరుగుతోందని ఇక్కడ ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఏంచేయాలో దిక్కుతోచని స్థితిలో కేసీఆర్ ఉన్నారు.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...