Skip to main content

జగన్ సంచలన నిర్ణయాలు.సంకట స్థితిలో సీఎం కేసీఆర్

ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు దేశ వ్యాప్తంగా కొత్త సంచలనాలకు దారితీస్తున్నాయి. ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా జగన్ ను ఫాలో అవుతున్నారు. ప్రధానంగా పోలవరం రివర్స్ టెండరింగ్, పీపీఏల పున: పరశీలించడం లాంటి నిర్ణయాలను అమలు చేయడానికి మిగితా రాష్ట్రాలు పూనుకుంటున్నాయి.ఇతర రాష్ట్రాల పరిస్థితి ఏమో గాని జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల పొరుగు రాష్ట్రం తెలంగాణా సీఎం కేసీఆర్ ను చిక్కుల్లోకి నెడుతున్నాయి.
ఆర్థిక లోటుతో సతమతమవుతున్నా జగన్ ఇచ్చిన హామీలను ఒక్కక్కటిగా నెరవేరుస్తున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అంశం ఇందులో ప్రధానమైనది. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రికి సాధ్యంకాని పనిని చేసి చూపించారు. ఎన్నికలకు ముందు ఆర్టీసీ ఉద్యోగులకు తాను హామీ ఇచ్చిన విధంగా వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు ఏపీ సర్కార్ చర్యలు తీసుకుంటోంది.ఆర్టీసి విలీనానికి తోడు తాజాగా ఉద్యోగుల పదవీ విరమణ వయసును ప్రభుత్వం ఉద్యోగులతో సమానంగా 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తుంటే…గన్ తీసుకున్న తాజా నిర్ణయం తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మరింత ఇబ్బందిగా మారిందనే ప్రచారం సాగుతోంది. ఏపీలో మాదిరగానే తెలంగాణాలో కూడా ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోతే ఈ నెల 5 నుంచి సమ్మె చేస్తామని ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వానికి అల్టిమేటం కూడా జారీ చేశారు. అసలే దరసా కావడంతో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణం తీసుకుంటారోనని రాజకీయ వర్గాల్లో చర్చజరుగుతోంది.
ఏపీలోని ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతూ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఈ విషయంలో మరింత ఒత్తిడి పెరిగినట్టయ్యిందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.అప్పుల్లో ఉన్న ఏపీ రాష్ట్రం ఆర్టీసీ ఉద్యోగులకు ఎంతో మేలు చేస్తుంటే… ధనిక రాష్ట్రమని చెప్పుకునే తెలంగాణలో మాత్రం తమకు అన్యాయం జరుగుతోందని ఇక్కడ ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఏంచేయాలో దిక్కుతోచని స్థితిలో కేసీఆర్ ఉన్నారు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...