Skip to main content

జగన్ సంచలన నిర్ణయాలు.సంకట స్థితిలో సీఎం కేసీఆర్

ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు దేశ వ్యాప్తంగా కొత్త సంచలనాలకు దారితీస్తున్నాయి. ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా జగన్ ను ఫాలో అవుతున్నారు. ప్రధానంగా పోలవరం రివర్స్ టెండరింగ్, పీపీఏల పున: పరశీలించడం లాంటి నిర్ణయాలను అమలు చేయడానికి మిగితా రాష్ట్రాలు పూనుకుంటున్నాయి.ఇతర రాష్ట్రాల పరిస్థితి ఏమో గాని జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల పొరుగు రాష్ట్రం తెలంగాణా సీఎం కేసీఆర్ ను చిక్కుల్లోకి నెడుతున్నాయి.
ఆర్థిక లోటుతో సతమతమవుతున్నా జగన్ ఇచ్చిన హామీలను ఒక్కక్కటిగా నెరవేరుస్తున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అంశం ఇందులో ప్రధానమైనది. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రికి సాధ్యంకాని పనిని చేసి చూపించారు. ఎన్నికలకు ముందు ఆర్టీసీ ఉద్యోగులకు తాను హామీ ఇచ్చిన విధంగా వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు ఏపీ సర్కార్ చర్యలు తీసుకుంటోంది.ఆర్టీసి విలీనానికి తోడు తాజాగా ఉద్యోగుల పదవీ విరమణ వయసును ప్రభుత్వం ఉద్యోగులతో సమానంగా 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తుంటే…గన్ తీసుకున్న తాజా నిర్ణయం తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మరింత ఇబ్బందిగా మారిందనే ప్రచారం సాగుతోంది. ఏపీలో మాదిరగానే తెలంగాణాలో కూడా ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోతే ఈ నెల 5 నుంచి సమ్మె చేస్తామని ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వానికి అల్టిమేటం కూడా జారీ చేశారు. అసలే దరసా కావడంతో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణం తీసుకుంటారోనని రాజకీయ వర్గాల్లో చర్చజరుగుతోంది.
ఏపీలోని ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతూ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఈ విషయంలో మరింత ఒత్తిడి పెరిగినట్టయ్యిందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.అప్పుల్లో ఉన్న ఏపీ రాష్ట్రం ఆర్టీసీ ఉద్యోగులకు ఎంతో మేలు చేస్తుంటే… ధనిక రాష్ట్రమని చెప్పుకునే తెలంగాణలో మాత్రం తమకు అన్యాయం జరుగుతోందని ఇక్కడ ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఏంచేయాలో దిక్కుతోచని స్థితిలో కేసీఆర్ ఉన్నారు.

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...