Skip to main content

బాలకృష్ణన్ కమిటీతో సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం జగన్




ఏపీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్యారంగంలో సంస్కరణలపై ఏర్పాటైన ప్రొఫెసర్ బాలకృష్ణన్ కమిటీతో జగన్ ఇవాళ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ,  1 నుంచి 8వ తరగతి వరకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తామని స్పష్టం చేశారు. 1200 మంది ఉపాధ్యాయులకు రూ.5 కోట్ల ఖర్చుతో శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. విద్యార్థుల సంఖ్యకు సరిపడేలా ఉపాధ్యాయులు ఉండాలని అధికారులకు సూచించారు. అంతేగాకుండా, ఉన్నతవిద్యకు సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. 100 ఎకరాల స్థలం ఉంటేనే అగ్రికల్చర్ కాలేజీకి అనుమతి ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.  

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.