Skip to main content

అయోధ్యపై బాబా రామ్‌దేవ్‌ కీలక వ్యాఖ్యలు

 
అయోధ్యపై బాబా రామ్‌దేవ్‌ కీలక వ్యాఖ్యలు
 అయోధ్య వివాదంపై యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాముడు అయోధ్యలోనే జన్మించాడనే విషయం ముస్లిం సమాజం సహా ప్రపంచం మొత్తానికి తెలుసని వ్యాఖ్యానించారు. ఇక అయోధ్య వివాదం ముగింపునకు వచ్చిందని, ఆ స్థలంలో రామ మందిరం కట్టాల్సిందేనని డిమాండ్‌ చేశారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల్లో భాజపాకు మద్దతిస్తున్న ఆయన.. కేంద్ర, రాష్ట్రాల్లో స్థిర ప్రభుత్వం ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370 రద్దు చేసినందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను రామ్‌దేవ్‌ అభినందించారు. ‘‘సర్దార్‌పటేల్‌ తర్వాత మోదీ, షా చొరవ తీసుకొని ‘ఒకే దేశం-ఒకే రాజ్యాంగం-ఒకే జెండా’ కలను నెరవేర్చారు. ఈ నిర్ణయం మోదీ-షా ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసాన్ని మరింత పెంచాయి. ఇక ఆర్థిక మందగమనం ప్రస్తుతం చాలా దేశాలు ఎదుర్కొంటున్నాయి. ఈ సంక్షోభాన్ని మోదీ నాయకత్వంలో సమర్థంగా పరిష్కరిస్తారు’’ అని అన్నారు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...