Skip to main content

అయోధ్యపై బాబా రామ్‌దేవ్‌ కీలక వ్యాఖ్యలు

 
అయోధ్యపై బాబా రామ్‌దేవ్‌ కీలక వ్యాఖ్యలు
 అయోధ్య వివాదంపై యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాముడు అయోధ్యలోనే జన్మించాడనే విషయం ముస్లిం సమాజం సహా ప్రపంచం మొత్తానికి తెలుసని వ్యాఖ్యానించారు. ఇక అయోధ్య వివాదం ముగింపునకు వచ్చిందని, ఆ స్థలంలో రామ మందిరం కట్టాల్సిందేనని డిమాండ్‌ చేశారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల్లో భాజపాకు మద్దతిస్తున్న ఆయన.. కేంద్ర, రాష్ట్రాల్లో స్థిర ప్రభుత్వం ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370 రద్దు చేసినందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను రామ్‌దేవ్‌ అభినందించారు. ‘‘సర్దార్‌పటేల్‌ తర్వాత మోదీ, షా చొరవ తీసుకొని ‘ఒకే దేశం-ఒకే రాజ్యాంగం-ఒకే జెండా’ కలను నెరవేర్చారు. ఈ నిర్ణయం మోదీ-షా ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసాన్ని మరింత పెంచాయి. ఇక ఆర్థిక మందగమనం ప్రస్తుతం చాలా దేశాలు ఎదుర్కొంటున్నాయి. ఈ సంక్షోభాన్ని మోదీ నాయకత్వంలో సమర్థంగా పరిష్కరిస్తారు’’ అని అన్నారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...