Skip to main content

జగన్ సర్కార్ రివర్స్ టెండరింగ్‌.. ఈసారి ఎన్ని కోట్ల ఆదా అంటే?


Jagan Success In Veligonda Project Reverse Tendering, జగన్ సర్కార్ రివర్స్ టెండరింగ్‌.. ఈసారి ఎన్ని కోట్ల ఆదా అంటే?
ఏపీలో సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలనాత్మక నిర్ణయాలను తీసుకుంటూ.. ప్రగతి పథంలో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే నిపుణుల కమిటీ సూచనల మేరకు వెలిగొండ ప్రాజెక్ట్‌లో రివర్స్ టెండరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లిన జగన్ ప్రభుత్వం కోట్ల మేర డబ్బులను ఆదా చేసింది. ఈ రివర్స్ టెండరింగ్‌లో దాదాపు రూ.87 కోట్ల మేర జగన్ ప్రభుత్వం ఆదా చేసినట్లు తెలుస్తోంది.
ప్రకాశం జిల్లాకు ప్రాణాధారమైన వెలిగొండ ప్రాజెక్ట్ పనులను గతంలో రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ సంస్థ రూ. 597.35 కోట్లకు దక్కించుకుంది. ఈ క్రమంలో రెండో టన్నల్ పనుల టెండర్ల విషయంలో అవకతవకలు చోటు చేసుకున్నట్లు నిపుణుల కమిటీ నిర్ధారించింది. రిత్విక్ సంస్థ 4.69 శాతం అధికంగా కోట్ చేసి టెండర్ దక్కించుకున్నట్లు గుర్తించారు.
దీంతో జగన్ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు వెళ్ళింది. ఈ ప్రక్రియలో భాగంగా రివర్స్‌ టెండరింగ్‌లో మేఘా సంస్థ రూ. 491.6 కోట్లకు బిడ్‌ దాఖలు చేసి.. రూ. 553.13 కోట్ల టెండర్‌ను 7 శాతం తక్కువకు దక్కించుకుంది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.87 కోట్లు ఆదా అయ్యాయి. అటు పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కూడా రివర్స్ టెండరింగ్‌కు వెళ్లిన జగన్ సర్కారుకు రూ. 782.8 కోట్ల లభ్ది చేకూరిన సంగతి తెలిసిందే.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.