Skip to main content

జగన్ సర్కార్ రివర్స్ టెండరింగ్‌.. ఈసారి ఎన్ని కోట్ల ఆదా అంటే?


Jagan Success In Veligonda Project Reverse Tendering, జగన్ సర్కార్ రివర్స్ టెండరింగ్‌.. ఈసారి ఎన్ని కోట్ల ఆదా అంటే?
ఏపీలో సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలనాత్మక నిర్ణయాలను తీసుకుంటూ.. ప్రగతి పథంలో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే నిపుణుల కమిటీ సూచనల మేరకు వెలిగొండ ప్రాజెక్ట్‌లో రివర్స్ టెండరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లిన జగన్ ప్రభుత్వం కోట్ల మేర డబ్బులను ఆదా చేసింది. ఈ రివర్స్ టెండరింగ్‌లో దాదాపు రూ.87 కోట్ల మేర జగన్ ప్రభుత్వం ఆదా చేసినట్లు తెలుస్తోంది.
ప్రకాశం జిల్లాకు ప్రాణాధారమైన వెలిగొండ ప్రాజెక్ట్ పనులను గతంలో రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ సంస్థ రూ. 597.35 కోట్లకు దక్కించుకుంది. ఈ క్రమంలో రెండో టన్నల్ పనుల టెండర్ల విషయంలో అవకతవకలు చోటు చేసుకున్నట్లు నిపుణుల కమిటీ నిర్ధారించింది. రిత్విక్ సంస్థ 4.69 శాతం అధికంగా కోట్ చేసి టెండర్ దక్కించుకున్నట్లు గుర్తించారు.
దీంతో జగన్ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు వెళ్ళింది. ఈ ప్రక్రియలో భాగంగా రివర్స్‌ టెండరింగ్‌లో మేఘా సంస్థ రూ. 491.6 కోట్లకు బిడ్‌ దాఖలు చేసి.. రూ. 553.13 కోట్ల టెండర్‌ను 7 శాతం తక్కువకు దక్కించుకుంది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.87 కోట్లు ఆదా అయ్యాయి. అటు పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కూడా రివర్స్ టెండరింగ్‌కు వెళ్లిన జగన్ సర్కారుకు రూ. 782.8 కోట్ల లభ్ది చేకూరిన సంగతి తెలిసిందే.

Comments

Popular posts from this blog

ఉల్లిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!

  ఆకాశాన్నంటిన్న ఉల్లిపాయల ధరలను కిందకు దించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని వెలువరించింది. ఈ నెలాఖరులోగా 2 వేల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఎంఎంటీసీ ద్వారా టెండర్లను కేంద్రం ఆహ్వానించింది. ఈ సంవత్సరం ఉల్లి దిగుబడి తగ్గడంతో కిలో ఉల్లిపాయల ధర రూ. 80 వరకూ పలుకుతుండగా, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న సంగతి తెలిసిందే. అసలే పండగల సీజన్ కావడం, పైగా మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఈ నెలాఖరులో జరుగనున్న నేపథ్యంలో, ప్రజా వ్యతిరేకతను తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

తమిళనాడులో కుండపోత వర్షం...వరుణాగ్రహంతో వణుకుతున్న రాష్ట్రం!

  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడులో కుండపోతగా వర్షం కురుస్తోంది. పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో జనం వణుకుతున్నారు. రాష్ట్రంలోని కాంచీపురం, ఆర్కేనగర్‌, తిరుత్తణి, తూత్తుకుడి, తిరునల్వేలి, తంజావూరు, తిరువారూరు, శివగంగై జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.  ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం వర్షబీభత్సం అధికంగా ఉన్న మధురై, రామనాథపురం జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించింది. సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను ప్రభుత్వం కోరింది.