Skip to main content

జగన్ సర్కార్ రివర్స్ టెండరింగ్‌.. ఈసారి ఎన్ని కోట్ల ఆదా అంటే?


Jagan Success In Veligonda Project Reverse Tendering, జగన్ సర్కార్ రివర్స్ టెండరింగ్‌.. ఈసారి ఎన్ని కోట్ల ఆదా అంటే?
ఏపీలో సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలనాత్మక నిర్ణయాలను తీసుకుంటూ.. ప్రగతి పథంలో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే నిపుణుల కమిటీ సూచనల మేరకు వెలిగొండ ప్రాజెక్ట్‌లో రివర్స్ టెండరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లిన జగన్ ప్రభుత్వం కోట్ల మేర డబ్బులను ఆదా చేసింది. ఈ రివర్స్ టెండరింగ్‌లో దాదాపు రూ.87 కోట్ల మేర జగన్ ప్రభుత్వం ఆదా చేసినట్లు తెలుస్తోంది.
ప్రకాశం జిల్లాకు ప్రాణాధారమైన వెలిగొండ ప్రాజెక్ట్ పనులను గతంలో రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ సంస్థ రూ. 597.35 కోట్లకు దక్కించుకుంది. ఈ క్రమంలో రెండో టన్నల్ పనుల టెండర్ల విషయంలో అవకతవకలు చోటు చేసుకున్నట్లు నిపుణుల కమిటీ నిర్ధారించింది. రిత్విక్ సంస్థ 4.69 శాతం అధికంగా కోట్ చేసి టెండర్ దక్కించుకున్నట్లు గుర్తించారు.
దీంతో జగన్ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు వెళ్ళింది. ఈ ప్రక్రియలో భాగంగా రివర్స్‌ టెండరింగ్‌లో మేఘా సంస్థ రూ. 491.6 కోట్లకు బిడ్‌ దాఖలు చేసి.. రూ. 553.13 కోట్ల టెండర్‌ను 7 శాతం తక్కువకు దక్కించుకుంది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.87 కోట్లు ఆదా అయ్యాయి. అటు పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కూడా రివర్స్ టెండరింగ్‌కు వెళ్లిన జగన్ సర్కారుకు రూ. 782.8 కోట్ల లభ్ది చేకూరిన సంగతి తెలిసిందే.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

పుట్టినరోజు కేక్ కట్ చేయడంపై తన అభిప్రాయాలు వెల్లడించిన పవన్ కల్యాణ్

 జనసేన పార్టీ అధ్యక్షుడు, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదినోత్సవం (సెప్టెంబరు 2) సందర్భంగా ఆయన అభిమానుల్లో కోలాహలం నెలకొంది. ఆయన మాత్రం ఎప్పటిలాగానే ఎంతో కూల్ గా కనిపించారు. తన బర్త్ డే సందర్భంగా పెద్దగా ఎప్పుడూ కేకులు కట్ చేయని పవన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించారు. చిన్నప్పటి నుంచి తనకు బర్త్ డే వేడుకలపై ఆసక్తి తక్కువని తెలిపారు. ఒకట్రెండు సార్లు స్కూల్లో చాక్లెట్లు పంచానని, కొన్ని సందర్భాల్లో తన కుటుంబ సభ్యులు కూడా తన పుట్టినరోజు సంగతి మర్చిపోయేవారని వెల్లడించారు. ఎప్పుడైనా తన పుట్టినరోజు సంగతి గుర్తొస్తే వదిన డబ్బులు ఇచ్చేవారని, ఆ డబ్బులతో పుస్తకాలు కొనుక్కోవడం తప్ప ప్రత్యేకమైన వేడుకలు తక్కువేనని పవన్ వివరించారు. "ఇక సినీ రంగంలోకి వచ్చిన తర్వాత నా పుట్టినరోజు వేడుకలను ఫ్రెండ్స్, నిర్మాతలు చేస్తుంటే ఇబ్బందికరంగా అనిపించేది. కేకు కోయడం, ఆ కేకు ముక్కలను నోట్లో పెట్టడం అంతా ఎబ్బెట్టుగా అనిపించేది. అందుకే జన్మదిన వేడుకలంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు... దీనికి వేరే కారణాలేవీ లేవు" అని పవన్ తెలిపారు.