Skip to main content

జిన్‌పింగ్‌ భోజనంలో తమిళ రుచులు

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ భారత పర్యటనలో భాగంగా ఇక్కడి స్థానిక వంటకాలను ఆయన రుచి చూడనున్నారు. ఇందులో భాగంగా తమిళనాడులో లభించే స్థానిక రుచులను ఆయనకు వడ్డించనున్నారు. రాత్రి భోజనంలో భాగంగా టమోటా చారు, అరచువిట్టా సాంబార్‌, కడలాయ్‌ కుర్మా, కవణరాశి హల్వాతో పాటు మరికొన్ని భారతీయ వంటలను వడ్డిస్తారు. ఇప్పటికే జిన్‌పింగ్‌ చెన్నై చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా స్థానిక ఐటీసీ హోటల్‌కు వెళ్లి బస చేస్తారు. అక్కడి నుంచి బయల్దేరి మహాబలిపురం చేరుకుంటారు. అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు స్వాగతం పలుకుతారు.జిన్‌పింగ్‌ భోజనంలో తమిళ రుచులు

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.