Skip to main content

బస్సును ఆపి యువతి టిక్ టాక్... తెగ వైరల్ అవుతున్న వీడియో

కిక్కిరిసిన ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సుకు ఎదురెళ్లి, దాన్ని ఆపి, ఓ బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేస్తూ టిక్ టాక్ చేసిన ఓ యువతి ఇప్పుడు కష్టాల పాలైంది. ట్రాఫిక్ కు అంతరాయం కలిగించడంతో పాటు పబ్లిక్ న్యూసెన్స్ కింద పోలీసులు ఆమెపై కేసును నమోదు చేశారు.

ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, పుణె నగరంలో ఆసాబ్ సార్, బైక్రేయి నగర్ మార్గంలో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సును ఓ యువతి ఆపింది. ఆపై వెంటనే తనలోని కళాకారిణిని బయటకు తీసి, డ్యాన్స్ చేసింది. ఆ వీడియోను టిక్ టాక్ లో పోస్ట్ చేయడంతో అది తెగ వైరల్ అయింది. దీనిపై స్థానిక పోలీసులు స్పందించి, ఆమెపై కేసును నమోదు చేశారు.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...