Skip to main content

తన ముగ్గురు పిల్లలను చంపి బాగ్దాదీ ఆత్మాహతికి పాల్పడ్డాడు: ట్రంప్ వెల్లడి




ఐసిస్ చీఫ్ అబూబకర్ అల్ బాగ్దాదీ మృతిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ధారించారు. అమెరికా సైనిక దాడుల సమయంలో బాగ్దాదీ ఆత్మాహుతికి పాల్పడ్డాడని ట్రంప్ వెల్లడించారు. తొలుత తన ముగ్గురు పిల్లలను చంపి, ఆపై తనను తాను పేల్చుకున్నాడని వివరించారు. ప్రపంచాన్ని భయపెట్టాలని చూసిన బాగ్దాదీ భయంతో పిరికిపందలా కుక్క చావు చచ్చాడని ట్రంప్ వ్యాఖ్యానించారు. బాగ్దాదీ తన చివరి క్షణాల్లో భయంతో వణికిపోయాడని, ప్రాణభయంతో భీతిల్లిపోయాడని వివరించారు. అమెరికా దళాలను చూడగానే ఓ సొరంగంలో దాక్కున్నాడని, రెండు గంటల ఆపరేషన్ అనంతరం బాగ్దాదీ ఆత్మాహుతితో చనిపోయాడని ట్రంప్ పేర్కొన్నారు.

సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులే లక్ష్యంగా అమెరికా చేపట్టిన స్పెషల్ ఆపరేషన్లో బాగ్దాదీ హతుడైనట్టు ఈ ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. ఇవాళో పెద్ద ఘటన జరిగిందని ట్రంప్ పేర్కొనడంతో బాగ్దాదీ మరణంపై కథనాలకు మరింత బలం చేకూరింది. కాగా, బాగ్దాదీని అంతమొందించేందుకు అమెరికా వారం క్రితమే వ్యూహరచన చేయగా, ట్రంప్ ఆమోదంతో కమాండోలు రంగంలోకి దిగి విజయవంతంగా పని పూర్తిచేశారు.  మృతి చెందింది బాగ్దాదీయేనని డీఎన్ఏ టెస్టులు కూడా నిర్ధారించాయని ట్రంప్ వెల్లడించారు.   

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

మరోసారి రంగంలోకి దిగిన ధర్మాడి సత్యం... ఓ చిన్నారి కోసం అన్వేషణ!

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దీప్తిశ్రీ అనే ఏడేళ్ల చిన్నారి అదృశ్యం కావడం సంచలనం సృష్టించింది. దీప్తిశ్రీని  హత్యచేసి ఇంద్రపాలెం వద్ద ఉప్పుటేరులో పడవేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. అమె సవతి తల్లి శాంతకుమారి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని దీప్తిశ్రీ బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో కీలక సమాచారం అందజేసినట్టు తెలుస్తోంది. శాంతకుమారి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇంద్రపాలెం లాకుల వద్ద దీప్తిశ్రీ మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. అందుకోసం పోలీసులు ధర్మాడి సత్యం బృందం సాయం కోరారు. ఇటీవలే గోదావరి నదిలో బోటును వెలికితీసిన ధర్మాడి సత్యం ఓ చిన్నారి కోసం వెంటనే స్పందించారు. తన బృందంతో ఉప్పుటేరులో గాలింపు చేపట్టారు. అయితే, 30 గంటలు గడిచిన తర్వాతే మృతదేహం నీటిపై తేలుతుందని, ఈలోపు తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని ధర్మాడి సత్యం తెలిపారు.