Skip to main content

తీహార్ జైలులో చిదంబరానికి అస్వస్థత!

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పితో బాధపడుతున్న ఆయన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ కు ఈరోజు తరలించారు. అక్కడ సంబంధిత వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత తిరిగి ఆయనను జైలుకు తరలిస్తారని సంబంధిత వర్గాల సమాచారం.  

ఇదిలా ఉండగా, తీహార్ జైల్లో ఖైదీలకు ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు సాధారణంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలిస్తుంటారు. కానీ, చిదంబరం విషయంలో మాత్రం ఆయన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు. ఒకవేళ చిదంబరానికి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తితే కనుక ఆయన్ని ఎయిమ్స్, ఆర్ఎంఎల్ ఆసుపత్రి, లేదా సఫ్దార్ జంగ్ ఆసుపత్రికి తరలించాలన్న కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.