Skip to main content

వైసీపీ ఎమ్మెల్యే పై ఫిర్యాదు చేసిన ఎంపిడిఓ.. కేసు నమోదు చేసిన పోలీసులు


నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పై రురల్ పోలీసులు కేసు నమోదు చేశారు..ఎమ్మెల్యేతో పాటు వైసీపి జిల్లా అధికార ప్రతినిధి బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిపై నెల్లూరు గ్రామీణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
అనుచరులతో కలిసి ఎమ్మెల్యే తన ఇంటిపై దాడికి దిగాడని, నివాసంపై దౌర్జన్యంపై చేశారని వెంకటాచలం ఎంపిడిఓ సరళ పోలీసులను ఆశ్రయించారు.. వెంకటాచలం మండలంలోని గొలగమూడి వద్ద ఓ ప్రైవేటు లే అవుట్ కు సంభందించి పంచాయితీ పైప్ లైన్ కనెక్షన్ కావాలని తనకు వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి ఎంపిడిఓ సరళకు అప్లికేషన్ పెట్టుకున్నారు..
అయితే ఎంపిడిఓ బిజీగా ఉండటంతో ఆ అప్లికేషన్ పక్కన పెట్టారు. గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షలు, నియామకాలు తదితర అంశాల్లో తాను తీరిక లేకుండా ఉంటడంతో వారి ధరఖాస్తును పరిశీలించడం ఆలస్యమైందని ఆమె పిర్యాదులో తెలిపింది.
అయితే ఈనెల 1వ తేదీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ లో తనను బెదిరించారని శుక్రవారం రాత్రి ఏకంగా కల్లూరు పల్లిలోని తన నివాసం వద్దకు వచ్చి కరెంటు తీసివేయించారని ఆరోపించారు. ఇంట్లో ఉన్న తన కుటుంబసభ్యులను బెదిరించారని పోలీసులకు తెలిపింది. కాగా.. సరళ గతంలో జిల్లాలోని అనేక మండలాల్లో పని చేసింది.. ప్రస్తుతం వెంకటాచలంలో పనిచేస్తుంది..

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.