Skip to main content

ప్రభుత్వ పాఠశాలలో మద్యంతో బాలిక పుట్టిన రోజు వేడుకలు.. మందలించినందుకు ఆత్మహత్య



ప్రభుత్వ పాఠశాలలో ఓ బాలిక తన బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను మద్యంతో జరుపుకోగా, విషయం తెలిసిన ఉపాధ్యాయిని మందలించింది. దీంతో మనస్తాపం చెందిన బాలిక ఆత్మహత్య చేసుకుంది. తమిళనాడులోని సేలం ప్రభుత్వ పాఠశాలలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. సేలం ఇడైపట్టి విద్యాజోన్‌కు చెందిన ప్రభుత్వ బాలికల మహోన్నత పాఠశాలలో 1,500 మంది బాలికలు చదువుతున్నారు.

మంగళవారం ఉదయం స్కూల్‌లో అబ్దుల్ కలాం జయంతిని నిర్వహించారు. ప్లస్ టు చదువుతున్న ఓ విద్యార్థిని బర్త్‌డే కూడా అదే రోజు కావడంతో ఐదుగురు విద్యార్థులు కలిసి తరగతి గదిలో ఆమెతో కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేసుకున్నారు. సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ ఎంజాయ్ చేశారు.

అదే సమయంలో తరగతి గదిలోకి వచ్చిన టీచర్ వారి చేతుల్లోని బీర్ బాటిళ్లు చూసి ఆగ్రహం వ్యక్తం చేసింది. వారి తల్లిదండ్రులను పిలిపించి వారి ఎదుటే విద్యార్థులను మందలించింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన విద్యార్థిని ఒకరు తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండానే కుమార్తె మృతదేహాన్ని తల్లిదండ్రులు దహనం చేయడం వివాదాస్పదమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...