Skip to main content

ప్రభుత్వ పాఠశాలలో మద్యంతో బాలిక పుట్టిన రోజు వేడుకలు.. మందలించినందుకు ఆత్మహత్య



ప్రభుత్వ పాఠశాలలో ఓ బాలిక తన బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను మద్యంతో జరుపుకోగా, విషయం తెలిసిన ఉపాధ్యాయిని మందలించింది. దీంతో మనస్తాపం చెందిన బాలిక ఆత్మహత్య చేసుకుంది. తమిళనాడులోని సేలం ప్రభుత్వ పాఠశాలలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. సేలం ఇడైపట్టి విద్యాజోన్‌కు చెందిన ప్రభుత్వ బాలికల మహోన్నత పాఠశాలలో 1,500 మంది బాలికలు చదువుతున్నారు.

మంగళవారం ఉదయం స్కూల్‌లో అబ్దుల్ కలాం జయంతిని నిర్వహించారు. ప్లస్ టు చదువుతున్న ఓ విద్యార్థిని బర్త్‌డే కూడా అదే రోజు కావడంతో ఐదుగురు విద్యార్థులు కలిసి తరగతి గదిలో ఆమెతో కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేసుకున్నారు. సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ ఎంజాయ్ చేశారు.

అదే సమయంలో తరగతి గదిలోకి వచ్చిన టీచర్ వారి చేతుల్లోని బీర్ బాటిళ్లు చూసి ఆగ్రహం వ్యక్తం చేసింది. వారి తల్లిదండ్రులను పిలిపించి వారి ఎదుటే విద్యార్థులను మందలించింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన విద్యార్థిని ఒకరు తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండానే కుమార్తె మృతదేహాన్ని తల్లిదండ్రులు దహనం చేయడం వివాదాస్పదమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...