Skip to main content

నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే ఈ-కామర్స్ సంస్థలపై కఠిన చర్యలు: పీయూష్ గోయల్

దేశంలోని మల్టీ బ్రాండ్ రిటైలర్లు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విషయంలో నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే అటువంటి సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హెచ్చరించారు. 'ఈ-కామర్స్ సంస్థలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించింది. వీటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. చట్టం ప్రకారం మల్టీ బ్రాండ్ రిటైల్ లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 49 శాతానికి మించకూడదు. దేశంలోని చిన్న వ్యాపారులు జీవనోపాధి కోల్పోకుండా వారికి బీజేపీ అండగా నిలబడుతుంది' అని తెలిపారు.

'రిటైల్ మార్కెట్ ను దెబ్బ తీసేలా వస్తువులపై డిస్కౌంట్లు, మోసపూరిత ధరలు ప్రకటించే హక్కు ఈ-కామర్స్ సంస్థలకు లేదు. అలాగే, సొంతంగా ఉత్పత్తులను తయారు చేసుకుని, విక్రయించే హక్కు కూడా లేదు. ఇటీవల ప్రకటించిన ధరల విషయంలో పూర్తి వివరణ ఇవ్వాలని ఈ-కామర్స్ సంస్థలను వాణిజ్య శాఖ ఇప్పటికే ఆదేశించింది' అని పీయూష్ గోయల్ వివరించారు. కాగా, పండుగల నేపథ్యంలో అమెజాన్‌, ఫ్లిప్‌ కార్ట్‌ వంటి సంస్థలు భారీ ఆఫర్లు ప్రకటించి, వినియోగదారులను ఆకర్షించిన విషయం తెలిసిందే.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.