Skip to main content

జగన్ కంటే వైయస్ రాజశేఖరరెడ్డి బెటర్: చంద్రబాబు

2007లో పత్రికా స్వేచ్ఛను హరించేలా అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఓ జీవో తీసుకొచ్చారని... ఆ జీవోకు వ్యతిరేకంగా అన్ని పార్టీల నేతలు, మీడియా ప్రతినిధులు అందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. పత్రికా విలేకరులు అర్ధరాత్రి సెక్రటేరియట్ లో ధర్నాలు చేశారని... జాతీయ పత్రికల సంపాదకులు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారని తెలిపారు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో తాను పోరాడానని చెప్పారు. దీంతో రాజశేఖరరెడ్డి వెనకడుగు వేశారని... మూడునాలుగు నెలల్లో తాను మీడియా వాచ్ అనే మీటింగే పెట్టలేదని... ఇది ఏవిధంగా జరిగిందో తనకు తెలియదని... తక్షణమే జీవోను రద్దు చేస్తున్నానని ప్రకటించారని తెలిపారు. తనకు ఎలాంటి దురుద్దేశాలు లేవని ఆయన చెప్పారని తెలిపారు.

మీ ప్రమేయం లేకుండా జీవో ఎలా వస్తుందో చెప్పమని తాము వైయస్ ను ప్రశ్నించామని చంద్రబాబు చెప్పారు. దీనికి సమాధానంగా విచారణ జరిపిస్తామని వైయస్ చెప్పారని తెలిపారు. ఒక రకంగా చెప్పాలంటే వైయస్ విజ్ఞతను మనం అభినందించాలని చెప్పారు. రాజకీయ నేతలు, మేధావులు అందరి స్పందన చూసిన తర్వాత జీవోను విత్ డ్రా చేశారని తెలిపారు.

ఇప్పుడు అదే జీవోను ప్రస్తుత సీఎం జగన్ కేబినెట్ మీటింగ్ లో పెట్టారని చంద్రబాబు విమర్శించారు. ఆ జీవోకు ఇంకొంచెం పదును పెట్టారని అన్నారు. జగన్ ఆ జీవోను మాత్రమే చూశారని... ఆ జీవోను ఆయన తండ్రి విత్ డ్రా చేసుకున్న విషయాన్ని చూడలేదని చెప్పారు. దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే విషయాన్ని జగన్ గుర్తు పెట్టుకోవాలని అన్నారు. చేసిన తప్పును ఆరోజు రాజశేఖరెడ్డి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కరెక్ట్ చేసుకున్నారని... జగన్ మాత్రం అహంభావం, గర్వంతో ముందుకు పోతున్నారని విమర్శించారు. జగన్ కంటే వైయస్ చాలా బెటర్ అని కితాబిచ్చారు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...