Skip to main content

జగన్ కంటే వైయస్ రాజశేఖరరెడ్డి బెటర్: చంద్రబాబు

2007లో పత్రికా స్వేచ్ఛను హరించేలా అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఓ జీవో తీసుకొచ్చారని... ఆ జీవోకు వ్యతిరేకంగా అన్ని పార్టీల నేతలు, మీడియా ప్రతినిధులు అందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. పత్రికా విలేకరులు అర్ధరాత్రి సెక్రటేరియట్ లో ధర్నాలు చేశారని... జాతీయ పత్రికల సంపాదకులు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారని తెలిపారు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో తాను పోరాడానని చెప్పారు. దీంతో రాజశేఖరరెడ్డి వెనకడుగు వేశారని... మూడునాలుగు నెలల్లో తాను మీడియా వాచ్ అనే మీటింగే పెట్టలేదని... ఇది ఏవిధంగా జరిగిందో తనకు తెలియదని... తక్షణమే జీవోను రద్దు చేస్తున్నానని ప్రకటించారని తెలిపారు. తనకు ఎలాంటి దురుద్దేశాలు లేవని ఆయన చెప్పారని తెలిపారు.

మీ ప్రమేయం లేకుండా జీవో ఎలా వస్తుందో చెప్పమని తాము వైయస్ ను ప్రశ్నించామని చంద్రబాబు చెప్పారు. దీనికి సమాధానంగా విచారణ జరిపిస్తామని వైయస్ చెప్పారని తెలిపారు. ఒక రకంగా చెప్పాలంటే వైయస్ విజ్ఞతను మనం అభినందించాలని చెప్పారు. రాజకీయ నేతలు, మేధావులు అందరి స్పందన చూసిన తర్వాత జీవోను విత్ డ్రా చేశారని తెలిపారు.

ఇప్పుడు అదే జీవోను ప్రస్తుత సీఎం జగన్ కేబినెట్ మీటింగ్ లో పెట్టారని చంద్రబాబు విమర్శించారు. ఆ జీవోకు ఇంకొంచెం పదును పెట్టారని అన్నారు. జగన్ ఆ జీవోను మాత్రమే చూశారని... ఆ జీవోను ఆయన తండ్రి విత్ డ్రా చేసుకున్న విషయాన్ని చూడలేదని చెప్పారు. దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే విషయాన్ని జగన్ గుర్తు పెట్టుకోవాలని అన్నారు. చేసిన తప్పును ఆరోజు రాజశేఖరెడ్డి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కరెక్ట్ చేసుకున్నారని... జగన్ మాత్రం అహంభావం, గర్వంతో ముందుకు పోతున్నారని విమర్శించారు. జగన్ కంటే వైయస్ చాలా బెటర్ అని కితాబిచ్చారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...