Skip to main content

కుప్పంలో రాజీనామా చేసి గెలవండి...చంద్రబాబుకు విజయసాయి సవాల్


 ప్రజలు తనను కలవరిస్తున్నట్లు భావిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తన సొంత నియోజకవర్గమైన కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మళ్లీ గెలవాలని వైసీపీ నేత విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును సవాల్ చేశారు.నాలుగు మాసాల జగన్ పాలనతో విసిగిపోయిన ప్రజలు మళ్లీ తననే కోరుకుంటున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రజలంటే కుల మీడియా అధిపతులు, మీ బంధుగణం, మోచేతి నీళ్లు తాగే చెంచాలు కాదని...13 జిల్లాల్లోని 5 కోట్ల మంది జనమన్నారు. నిజంగానే ప్రజలు మిమ్మల్ని కలవరిస్తున్నట్లు భావిస్తే తన సొంత నియోజకవర్గమైన కుప్పం అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ చేశారు.

ఒక వ్యక్తి తన టచ్ మహిమతో దేశంలోని ప్రతిపక్షాలన్నిటినీ కోలుకోకుండా చేశారంటూ చంద్రబాబుపై విరుచుకపడ్డారు. వచ్చే జనవరిలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, 2021 మేలో జరిగే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో అందరూ ఊహించగలిగిందేనన్నారు. ఇప్పుడేమో చంద్రబాబు బీజేపీ క్షమాభిక్ష కోసం ఎదురుచూస్తున్నారని ఎద్దేవా చేశారు.
కాగా సీఎం జగన్ పాలనపై విజయసాయి రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. సీఎంగా పగ్గాలు చేపట్టిన నాలుగు మాసాల్లోనే సీఎం జగన్ 80 శాతం హామీలను నెరవేర్చారని కొనియాడారు. వంశపారంపర్య అర్చకత్వానికి ఆమోదం తెలపడం ద్వారా ఆలయాలపైన ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది అర్చక కుటుంబాలకు సీఎం భరోసా కల్పించారని చెప్పారు.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

నీకు పూర్తి మద్దతిస్తా: వంశీ రెండో లేఖపై స్పందించిన చంద్రబాబు

  తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడి మధ్య ఇప్పుడు లేఖల ద్వారా మాటలు సాగుతున్నాయి. నిన్న తన రాజీనామాకు దారితీసిన అంశాలను వివరిస్తూ, వంశీ లేఖ రాయగా, దానిపై చంద్రబాబు స్పందించారు. చంద్రబాబు స్పందనపై కృతజ్ఞతలు తెలుపుతూ, వంశీ మరో లేఖను రాయగా, చంద్రబాబు దానిపైనా స్పందించారు. వంశీకి పార్టీ పట్ల ఉన్న అంకితభావం, ఆయన చేసిన పోరాటాలను తాను మరువలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వంశీ చేసే పోరుకు తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. సమస్యలను పరిష్కరించుకుని, ఓ స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుదామని చంద్రబాబు సూచించారు. వంశీని బుజ్జగించే బాధ్యతలను ఎంపీ కేశినేని నాని, పార్టీ నేత కొనకళ్ల నారాయణలకు చంద్రబాబు అప్పగించినట్టు తెలుస్తోంది.