కుప్పంలో రాజీనామా చేసి గెలవండి...చంద్రబాబుకు విజయసాయి సవాల్
ప్రజలు తనను కలవరిస్తున్నట్లు భావిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తన సొంత నియోజకవర్గమైన కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మళ్లీ గెలవాలని వైసీపీ నేత విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును సవాల్ చేశారు.నాలుగు మాసాల జగన్ పాలనతో విసిగిపోయిన ప్రజలు మళ్లీ తననే కోరుకుంటున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రజలంటే కుల మీడియా అధిపతులు, మీ బంధుగణం, మోచేతి నీళ్లు తాగే చెంచాలు కాదని...13 జిల్లాల్లోని 5 కోట్ల మంది జనమన్నారు. నిజంగానే ప్రజలు మిమ్మల్ని కలవరిస్తున్నట్లు భావిస్తే తన సొంత నియోజకవర్గమైన కుప్పం అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ చేశారు.
ఒక వ్యక్తి తన టచ్ మహిమతో దేశంలోని ప్రతిపక్షాలన్నిటినీ కోలుకోకుండా చేశారంటూ చంద్రబాబుపై విరుచుకపడ్డారు. వచ్చే జనవరిలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, 2021 మేలో జరిగే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో అందరూ ఊహించగలిగిందేనన్నారు. ఇప్పుడేమో చంద్రబాబు బీజేపీ క్షమాభిక్ష కోసం ఎదురుచూస్తున్నారని ఎద్దేవా చేశారు.
కాగా సీఎం జగన్ పాలనపై విజయసాయి రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. సీఎంగా పగ్గాలు చేపట్టిన నాలుగు మాసాల్లోనే సీఎం జగన్ 80 శాతం హామీలను నెరవేర్చారని కొనియాడారు. వంశపారంపర్య అర్చకత్వానికి ఆమోదం తెలపడం ద్వారా ఆలయాలపైన ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది అర్చక కుటుంబాలకు సీఎం భరోసా కల్పించారని చెప్పారు.
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్ ఫార్మాసూటికల్ ఇన్గ్రీడియంట్స్ (ఏపీఐ) దిగుమతులపై భారత ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా పెంచాలని ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది. ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...
Comments
Post a Comment