Skip to main content

మోదీతో కేసీఆర్ ఏం మాట్లాడారంటే!


ఢిల్లీ: రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రం సానుకూలంగా స్పందించాలని కోరుతూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శుక్రవారం జరిపిన ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. దాదాపు 50 నిమిషాలపాటు ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించి 22 అంశాలపై లేఖలు ఇచ్చారు. అభివృద్ధిపథకాలు, పలు సంక్షేమ పథకాలతోపాటు, ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణకు సహకరించాలని కోరారు. ఇందులో ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్‌ విభజన బిల్లు ప్రకారం తెలంగాణలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఏటా 450 కోట్లు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉందని, గత ఐదేళ్లలో నాలుగుసార్లు విడుదలయినప్పటికీ ఒక ఏడాది కి సంబంధించిన నిధులు ఇంకా విడుదల కాలేదని పేర్కొన్నారు. ఆ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రధానమంత్రికి సీఎం కేసీఆర్‌ ఇచ్చిన లేఖల్లోని మరికొన్ని అంశాలు ఇలా ఉన్నాయి.
-నేషనల్‌ హై వేస్‌ అధారిటీ సహకారంతో ఆదిలాబాద్‌ జిల్లాలో సిమెంట్‌ కార్పొరేషన్‌ఆఫ్‌ ఇండియా పరిశ్రమను పునరుద్దరించాలి.
-తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్యను 24 నుంచి 42 కు పెంచాలి.
-తెలంగాణలో ఐఐఎంను నెలకొల్పాలి.
-తెలంగాణకు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐఐఎస్‌ఇఆర్‌)మంజూరు చేయాలి.
-హైదరాబాద్‌లో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌ డిజైన్‌ (ఎన్‌ఐడి)ని ఏర్పాటు చేయాలి. హైదరాబాద్‌లో నెలకొల్పాలని ప్రతిపాదించిన ఎన్‌ఐడిని రాష్ట్ర పునర్విభజన తర్వాత విశాఖపట్నానికి తరలించారు.
-అన్ని జిల్లాల్లో నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలనే నిర్ణయం మేరకు తెలంగాణలో మరో 23 నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలి.
-రాష్ట్రంలో పెండింగ్‌ రైల్వే ప్రాజెక్టులను పూర్తిచేయాలి. రైల్వే పనులకు అవసరమైన నిధులను విడుదల చేయాలి.
-నీతి ఆయోగ్‌ సిఫారసులకు అనుగుణంగా మిషన్‌ కాకతీయ పథకానికి రూ. 5,000 కోట్లు, మిషన్‌భగీరధకు రూ.19,205 కోట్లు విడుదల చేయాలి.
-బయ్యారంలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయాలి.
-జహీరాబాద్‌ నిమ్జ్‌కు నిదులను విడుదల చేయాలి.
-తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసిన మేరకు, రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణ చేపట్టాలి.
-పిపిపి పద్దతిలో కరీంనగర్‌లో ఐఐఐటి నెలకొల్పాలి.
-తెలంగాణలో రిజర్వేషన్లు పెంచాలి. ముస్లిలలోని వెనుకబడిన కులాలకు 12శాతం రిజర్వేషన్లతో కలిపి మొత్తం బిసిలకు 37శాతం, ఎస్సీలకు 15, ఎస్టీలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించాలి.
-పార్లమెంట్‌లో, అసెంబ్లీలో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలి. ఈ విషయంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది.
-హైదరాబాద్‌- నాగపూర్‌, వరంగల్‌- హైదరాబాద్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌ను అభివృద్ధి పర్చాలి.
-వెనుకబడిన ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి కోసం పిఎంజిఎస్‌వై ద్వారా 4 వేల కోట్ల రూపాయలు కేటాయించాలి.
-వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో చే పట్టే రహదారుల పనులకు 60ః40 నిష్పత్తిలో కాకుండా వందశాతం ఖర్చు కేంద్రమే భరించాలి.
-సెంట్రల్‌యూనివర్శిటీ తరహాలో పూర్తి కేంద్ర ఖర్చుతో వరంగల్‌లో గిరిజన యూనివర్శిటీని నెలకొల్పాలి.
-వరంగల్‌ టక్స్‌టైల్‌ పార్కు కోసం వెయ్యికోట్ల రూపాయలను గ్రాంట్‌ ఇన్‌ఎయిడ్‌గా అందించాలి.
-రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలి.
-వరద కాలువకు సవరించిన అంచనాల ప్రకారం నిధులు విడుదల చేయాలి.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...

కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమే.. యుద్ధం వస్తే మేం సిద్ధం : ఇమ్రాన్‌

జమ్ముకశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు 74వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఐరాస వేదికగా కవ్వింపు ప్రకటన చేశారు. కశ్మీర్‌ను కేవలం రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.   ప్రపంచం ఏం చేసింది?.   బాలాకోట్‌లో 500 మంది తీవ్రవాదులు రెడీగా ఉన్నారని ఇండియా రక్షణ మంత్రి చెబుతున్నారు. 500 మంది తీవ్రవాదులను పంపి మేమేం సాధిస్తాం?. 500 మంది తీవ్రవాదులను పంపాల్సిన అవసరం మాకేంటి.?. ఇస్లామిక్ టెర్రరిజం అంటూ ఇండియా మాపై ముద్ర వేస్తుంది. కశ్మీరీల హక్కులు ఎవరికీ పట్టవు. కశ్మీర్‌లో అనుసరిస్తున్న విధానాలు భారత్‌లో ఉన్న ముస్లింలపై ఎలా ప్రభావం చూపుతాయో మోదీ ఆలోచించారా?. 10 లక్షల మంది రోహింగ్యాలను బర్మా నుంచి గెంటేస్తే ప్రపంచం ఏం చేసింది?. ఇలాంటి పరిణామాలే ఇస్లాం సమాజంలో ఆవేదన, అసంతృప్తిని రేపుతున్నాయి ’  అని ఇమ్రాన్ ఆగ్రహ వ్యక్తం చేశారు. యుద్ధం వస్తే మేం సిద్ధం! ‘ ఇప్పుడు చాలా సంక్లిష్టం సమయం నడుస్తోంది. అణ్వాయుధాలున్న రెండు దేశాలు తలపడాల్స...