Skip to main content

మోదీతో కేసీఆర్ ఏం మాట్లాడారంటే!


ఢిల్లీ: రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రం సానుకూలంగా స్పందించాలని కోరుతూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శుక్రవారం జరిపిన ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. దాదాపు 50 నిమిషాలపాటు ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించి 22 అంశాలపై లేఖలు ఇచ్చారు. అభివృద్ధిపథకాలు, పలు సంక్షేమ పథకాలతోపాటు, ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణకు సహకరించాలని కోరారు. ఇందులో ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్‌ విభజన బిల్లు ప్రకారం తెలంగాణలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఏటా 450 కోట్లు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉందని, గత ఐదేళ్లలో నాలుగుసార్లు విడుదలయినప్పటికీ ఒక ఏడాది కి సంబంధించిన నిధులు ఇంకా విడుదల కాలేదని పేర్కొన్నారు. ఆ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రధానమంత్రికి సీఎం కేసీఆర్‌ ఇచ్చిన లేఖల్లోని మరికొన్ని అంశాలు ఇలా ఉన్నాయి.
-నేషనల్‌ హై వేస్‌ అధారిటీ సహకారంతో ఆదిలాబాద్‌ జిల్లాలో సిమెంట్‌ కార్పొరేషన్‌ఆఫ్‌ ఇండియా పరిశ్రమను పునరుద్దరించాలి.
-తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్యను 24 నుంచి 42 కు పెంచాలి.
-తెలంగాణలో ఐఐఎంను నెలకొల్పాలి.
-తెలంగాణకు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐఐఎస్‌ఇఆర్‌)మంజూరు చేయాలి.
-హైదరాబాద్‌లో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌ డిజైన్‌ (ఎన్‌ఐడి)ని ఏర్పాటు చేయాలి. హైదరాబాద్‌లో నెలకొల్పాలని ప్రతిపాదించిన ఎన్‌ఐడిని రాష్ట్ర పునర్విభజన తర్వాత విశాఖపట్నానికి తరలించారు.
-అన్ని జిల్లాల్లో నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలనే నిర్ణయం మేరకు తెలంగాణలో మరో 23 నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలి.
-రాష్ట్రంలో పెండింగ్‌ రైల్వే ప్రాజెక్టులను పూర్తిచేయాలి. రైల్వే పనులకు అవసరమైన నిధులను విడుదల చేయాలి.
-నీతి ఆయోగ్‌ సిఫారసులకు అనుగుణంగా మిషన్‌ కాకతీయ పథకానికి రూ. 5,000 కోట్లు, మిషన్‌భగీరధకు రూ.19,205 కోట్లు విడుదల చేయాలి.
-బయ్యారంలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయాలి.
-జహీరాబాద్‌ నిమ్జ్‌కు నిదులను విడుదల చేయాలి.
-తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసిన మేరకు, రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణ చేపట్టాలి.
-పిపిపి పద్దతిలో కరీంనగర్‌లో ఐఐఐటి నెలకొల్పాలి.
-తెలంగాణలో రిజర్వేషన్లు పెంచాలి. ముస్లిలలోని వెనుకబడిన కులాలకు 12శాతం రిజర్వేషన్లతో కలిపి మొత్తం బిసిలకు 37శాతం, ఎస్సీలకు 15, ఎస్టీలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించాలి.
-పార్లమెంట్‌లో, అసెంబ్లీలో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలి. ఈ విషయంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది.
-హైదరాబాద్‌- నాగపూర్‌, వరంగల్‌- హైదరాబాద్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌ను అభివృద్ధి పర్చాలి.
-వెనుకబడిన ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి కోసం పిఎంజిఎస్‌వై ద్వారా 4 వేల కోట్ల రూపాయలు కేటాయించాలి.
-వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో చే పట్టే రహదారుల పనులకు 60ః40 నిష్పత్తిలో కాకుండా వందశాతం ఖర్చు కేంద్రమే భరించాలి.
-సెంట్రల్‌యూనివర్శిటీ తరహాలో పూర్తి కేంద్ర ఖర్చుతో వరంగల్‌లో గిరిజన యూనివర్శిటీని నెలకొల్పాలి.
-వరంగల్‌ టక్స్‌టైల్‌ పార్కు కోసం వెయ్యికోట్ల రూపాయలను గ్రాంట్‌ ఇన్‌ఎయిడ్‌గా అందించాలి.
-రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలి.
-వరద కాలువకు సవరించిన అంచనాల ప్రకారం నిధులు విడుదల చేయాలి.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...