Skip to main content

పార్టీకి దూరం చెయ్యాలని చూస్తున్నారు.. - సొంత పార్టీ నేతలపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్..

నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సొంత పార్టీ నేతల మీదే సంచలన వ్యాఖ్యలు చేశారు.. తన అరెస్ట్ వెనుక పార్టీలోని కొందరి పాత్ర ఉందంటూ ఆరోపించారు.. వెంకటాచలం ఎంపిడిఓ సరళ నివాసంపై దౌర్జన్యానికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు..
అనంతరం బెయిల్ పై విడుదల అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర దాగుందన్నారు.. పార్టీ నుంచి తనను దూరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎంపిడిఓ సరళ ఇంటిపై తాను దాడికి పాల్పడలేదన్నారు.. తాను తప్పు చేశానని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమన్నారు.. ఇదే సమయంలో ఆయన కొన్ని ఆరోపణలు చేశారు.. అధికారుల తీరుపై మండిపడ్డారు.. ఎంపీడీవో చేసిన ఆరోపణల్లో తన పాత్ర ఉందని తేలితే... షోకాజ్ నోటిస్ ఇవ్వకుండానే పార్టీ నుంచి బహిష్కరించాలని కోరారు. ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ చేయ్యమని సీఎం జగన్ ఆదేశిస్తే.. కొందరు ఉన్నతాధికారులు పక్షపాతంగా 
వ్యవహరించారన్నారు..
ఎంపీడీవో ఇంటిపై దాడికి పాల్పడ్డానని నిరూపిస్తే ఆమెకు క్షమాపణ చెబుతానని ప్రకటించారు. సీఎం జగన్ నాయకత్వంలో పనిచేసేందుకు గర్వపడుతున్నానన్న కోటంరెడ్డి... ఎవరెన్ని కుట్రలు చేసినా.. తాను నిరంతరం ప్రజల్లోనే ఉంటానని స్పష్టం చేశారు..తాను ఎంపిడిఓ ఇంటిపై దాడి చేశానని చెప్పినప్పుడు ఆవిడ పోలీస్ స్టేషన్ కు వెళ్ళాలి గాని...సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి ఇంటికి ఎందుకు వెళ్ళిందని ఆయన ప్రశ్నించారుచట్టానికి ఎవరు అతీతులు కాదని సీఎం జగన్ చెప్పడాన్నీ స్వాగతిస్తున్నాన్న ఎమ్మెల్యే..మాది నిజమైన ప్రభుత్వమని.. ప్రమాణస్వీకార సమయంలో జగన్ చేసిన ప్రమాణాన్ని తూచా తప్పకుండా పాటింస్తున్నారన్నారు.
తనకు, జిల్లా ఎస్పీ కి విభేదాలు ఉన్నాయన్నారు. ఇదే విషయంపై నాలుగు రోజుల క్రితం కలెక్టర్ కి ఫిర్యాదు చేశానని వివరించారు..ఆధారాలు ఉంటే చర్యలు తీసుకోమని సీఎం చెబితే.. ఎస్పీ వ్యక్తిగత కక్ష తీర్చుకునే ప్రయత్నం చేసారని ఆరోపించారు. అర్ధరాత్రి తన ఇంటిపై, అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి ఇంటిపై దాడులు చేసి ఇబ్బంది పెట్టారని ఆరోపించారు..

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...