Skip to main content

చంద్రుడిపైకి రాకెట్ పంపితే మహారాష్ట్ర ప్రజల కడుపు నిండుతుందా?: కేంద్రంపై రాహుల్ ధ్వజం


మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంపై విరుచుకుపడ్డారు. చంద్రుడిపైకి రాకెట్ పంపినంత మాత్రాన మహారాష్ట్ర ప్రజల కడుపు నిండుతుందా? అని ప్రశ్నించారు. దేశ ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతుంటే ప్రభుత్వ పెద్దలు మాత్రం ఆర్టికల్ 370, చంద్రయాన్-2 గురించే మాట్లాడుతున్నారని విమర్శించారు.

ఓవైపు నిరుద్యోగంతో యువత బాధపడుతుంటే చందమామను చూడాలంటూ సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు. మోదీ, అమిత్ షా ప్రజల దృష్టిని సమస్యల నుంచి మళ్లిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. నోట్ల రద్దు వల్ల ఎవరు లాభపడ్డారో ప్రధాని మోదీ చెప్పాలని నిలదీశారు. లాతూర్ జిల్లాలో ఎన్నికల సభ సందర్భంగా రాహుల్ గాంధీ పైవ్యాఖ్యలు చేశారు.

Comments

Popular posts from this blog

అరటిపండ్లు తినడానికి ఏం తొందరపడుతున్నాయో... గోవులతో పవన్ కల్యాణ్ మురిపెం

జనసేనాని పవన్ కల్యాణ్ తీరిక సమయాల్లో హైదరాబాద్ శివార్లలోని తన ఫాంహౌస్ లో గడుపుతారన్న విషయం తెలిసిందే. పవన్ వ్యవసాయ క్షేత్రంలో మామిడి, ఇతర ఫల వృక్షాలు ఎన్నో దర్శనమిస్తాయి. అనేక రకాల కూరగాయలు కూడా పండిస్తారు. అంతేకాదు, పెద్ద సంఖ్యలో గోవులను కూడా పవన్ పోషిస్తున్నారు. అందుకోసం తన ఫాంహౌస్ లో గోశాల ఏర్పాటు చేశారు. ఇవాళ ఆయన తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటారు. ఈ క్రమంలో గోశాలను సందర్శించిన సందర్భంగా గోవులతో ఉల్లాసంగా గడిపారు. వాటికి అరటి పండ్లు తినిపిస్తూ మురిసిపోయారు. కొన్ని ఆవులు అరటిపండ్లు అందుకునేందుకు ఎంత తొందరపడుతున్నాయో అంటూ ట్విట్టర్ లో తన ఉత్సాహాన్ని పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Android ఫోన్లలో బ్యాంక్ అకౌంట్ వివరాలు దోచుకునే కొత్త మాల్వేర్ 'BlackRock' హడలెత్తిస్తోంది

Trojan కేటగిరికి చెందినదిగా చెబుతున్న 'BlackRock' అనే ఒక మాల్వేర్ Android స్మార్ట్ ఫోన్ల నుండి వినియోగదారుల విలువైన బ్యాంక్ సమాచారాన్ని సేకరిస్తున్నట్లు బయటపడింది. ఇప్పటి వరకూ పర్సనల్ డేటా చౌర్యానికి మాత్రమే పరిమితమైన సైబర్ దాడులు ఇప్పుడు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల నుండి బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా దోచుకునేంతగా ముందుకు సాగుతోంది. ఒక మాల్వేర్, బ్యాంక్ అకౌంట్ ఆధారాలను మరియు క్రెడిట్ కార్డు వాటి వాటి వివరాలను ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ల ద్వారా సేకరిస్తున్నట్లు మరియు ఇది దాదాపుగా 300 పైగా ఆండ్రాయిడ్ యాప్స్ పైన తాన్ ప్రభావాన్ని చూపిస్తున్నట్లు తెలిపింది. అసలే ప్రజలు కరోనా మహమ్మారితో దెబ్బకి హడలెత్తి పోతోంటే, ఆన్ లైన్ లో సైబర్ దాడులు మరియు సైబర్ మోసాలు మరింతగా కృంగదీస్తున్నాయి. ఇప్పటి వరకూ పర్సనల్ డేటా చౌర్యానికి మాత్రమే పరిమితమైన సైబర్ దాడులు ఇప్పుడు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల నుండి బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా దోచుకునేంతగా ముందుకు  సాగుతోంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక నివేదిక ప్రకారం,Trojan కేటగిరికి చెందినదిగా చెబుతున్న 'BlackRock' అనే ఒక మాల్వేర్ Android స...