Skip to main content

మంత్రి అవంతి శ్రీనివాస్ ఇంటిని ముట్టడించిన జనసేన


 
ఇసుక కొరతతో ఏపీలోని భవన నిర్మాణ రంగం కుదేలైంది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వంపై విపక్షాలు విమర్శనాస్త్రాలను సంధిస్తున్నాయి. తాజాగా భవన నిర్మాణ కార్మికులతో కలసి జనసేన నేతలు విశాఖలోని మంత్రి అవంతి శ్రీనివాస్ ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని, తమకు ఉపాధి కల్పించాలని నినదించారు.

 ఈ సందర్భంగా కార్మికులు, జనసేన నేతలతో అవంతి మాట్లాడారు. తమ కష్టాలను మంత్రికి కార్మికులు వివరించారు. అనంతరం అవంతి మాట్లాడుతూ, వీలైనంత త్వరలో ఇసుకను అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. కొన్ని పార్టీలు కావాలనే ఈ అంశాన్ని వివాదాస్పదం చేస్తున్నాయని, రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నాయని విమర్శించారు.   

Comments

Popular posts from this blog

రష్యా టీకా సమర్థతపై సమాచారం లేదు: డబ్ల్యూహెచ్ఓ

  ఈ వారం ప్రారంభంలో రష్యా రిజిస్టర్ చేసిన కరోనా వ్యాక్సిన్ సమర్థతపై తమ వద్ద ఎటువంటి సమాచారమూ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్-వీపై రష్యా కూడా ఎటువంటి సమాచారం అందించలేదని, అది ఏ దశలో ఉందో తెలుసుకునేందుకు ఆ దేశంతో చర్చిస్తున్నామని డబ్ల్యూహెచ్ఓ సీనియర్ సలహాదారు డాక్టర్ బ్రూస్ అయల్వార్డ్ వ్యాఖ్యానించారు.  ప్రపంచంలో తయారవుతున్న కరోనా వ్యాక్సిన్లలో 9 వ్యాక్సిన్లు ప్రయోగదశలో ముందున్నాయని, వాటిల్లో స్పుత్నిక్ లేదని ఆయన అన్నారు. వ్యాక్సిన్ తయారీ డీల్స్, ఇన్వెస్ట్ మెంట్స్ కోసం తయారవుతున్న వ్యాక్సిన్ల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ఈ 9 టీకాలూ అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నాయని గుర్తించామని తెలిపారు.  

పోలవరం పూర్తి చేస్తే.. మీ పార్టీని మూసేస్తారా?

పోలవరం హెడ్‌వర్క్స్, జలవిద్యుత్‌ కేంద్రం పనుల రివర్స్‌ టెండరింగ్‌తో సుమారు రూ. 780 కోట్లు ఆదా చేసి చరిత్ర సృష్టించామని  రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తెలిపారు. వివరాలు కోసం క్లిక్ చేయండి