Skip to main content

కోర్టుకు రాలేనన్న వైఎస్ జగన్... కౌంటర్ లో కీలక వ్యాఖ్యలు చేసిన సీబీఐ!







ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై నేడు సీబీఐ కోర్టులో విచారణ జరుగనుంది. తాను ముఖ్యమంత్రిగా ఎన్నికైనందున వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును కోరుతూ, గతంలోనే జగన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సమాధానం ఇవ్వాలని సీబీఐకి స్పెషల్ కోర్టు నోటీసులు జారీ చేసింది.

ఇక తాజాగా, కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన సీబీఐ, ఈ కేసులో ప్రధాన నిందితుడు వైఎస్ జగన్ అని, ఆయన ప్రస్తుతం సీఎంగా ఉన్నందున, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును ఇస్తే, సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేసింది. వారానికోసారి కోర్టుకు హాజరయ్యేందుకు ఇబ్బందులు ఏముంటాయని ప్రశ్నించింది.

కాగా, సీబీఐ కౌంటర్ పిటిషన్ పై నేడు వాదోపవాదాలు జరగనున్నాయి. అనంతరం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జగన్ వ్యక్తిగత హాజరుపై నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, గతంలో ముఖ్యమంత్రులపై కోర్టు కేసుల తీరును పరిశీలిస్తే, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించే అవకాశాలే అధికంగా ఉన్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...