Skip to main content

టీడీపీ శ్రేణుల ఓపికను పరీక్షించొద్దు..- టీడీపీ మాజీమంత్రి హెచ్చరిక


నెల్లూరు జిల్లా కావలిలో వైకాపా నాయకుల దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, బీద రవిచంద్ర పరామర్శించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు..కావలి టీడీపీ ఆఫీసులో కూర్చోవున్న కార్యకర్తలపై దాడి చేయడం దుర్మార్గమన్నారు..ఐదు నెలలుగా కావలిలో టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూ, బెదిరిస్తుంటే ఇప్పటి వరకు పోలీసుల చర్యలు లేవంటూ ఆరోపించారు.
వాళ్ళు చర్యలు తీసుకోకపోవడం వల్లే తమ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారన్నారు..ప్రశాంతమైన నెల్లూరు జిల్లాలో శాంతిభద్రతలు చేయిదాటిపోతున్నాయని విమర్శించారు. టీడీపీ కార్యకర్తలపై భౌతిక దాడులు, ఆస్తుల విధ్వంసం జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. ఎమ్మెల్యేలు, వారి పక్కనే ఉండే చోటా నేతలు చెప్పిందే చేస్తామనే ధోరణిలో పోలీసులు వ్యవహరిస్తుంటే ప్రజాస్వామ్యం బతికేవుందా అనే అనుమానాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో పది సీట్లు ఇచ్చి మంచిగా పరిపాలించండయ్యా అంటే దొంగ కేసులు పెట్టడంతో పాటు దౌర్జన్యాలు, అరాచకాలు, ఆస్తుల విధ్వంసాలు చేస్తున్నారని విమర్శించారు.
టీడీపీ కార్యకర్తలను ఇళ్లకు వెళ్లి కొడుతూ తిరిగి బాధితులపైనే కేసులు పెడుతూ హింసిస్తున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్సీ బీదా రవి చంద్ర మాట్లాడుతూ తమ నేతలపై అట్రాసిటీ కేసులు పెడుతూ చిన్న చిన్న కుటుంబాలను సైతం వేధిస్తున్నారన్నారు.. వైకాపా నేతల తీరు మారకపోతే చూస్తూ ఊరుకోం..టీడీపీ శ్రేణుల ఓపికను పరీక్షించొద్దంటూ హెచ్చరించారు..

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...