Skip to main content

టీడీపీ శ్రేణుల ఓపికను పరీక్షించొద్దు..- టీడీపీ మాజీమంత్రి హెచ్చరిక


నెల్లూరు జిల్లా కావలిలో వైకాపా నాయకుల దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, బీద రవిచంద్ర పరామర్శించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు..కావలి టీడీపీ ఆఫీసులో కూర్చోవున్న కార్యకర్తలపై దాడి చేయడం దుర్మార్గమన్నారు..ఐదు నెలలుగా కావలిలో టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూ, బెదిరిస్తుంటే ఇప్పటి వరకు పోలీసుల చర్యలు లేవంటూ ఆరోపించారు.
వాళ్ళు చర్యలు తీసుకోకపోవడం వల్లే తమ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారన్నారు..ప్రశాంతమైన నెల్లూరు జిల్లాలో శాంతిభద్రతలు చేయిదాటిపోతున్నాయని విమర్శించారు. టీడీపీ కార్యకర్తలపై భౌతిక దాడులు, ఆస్తుల విధ్వంసం జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. ఎమ్మెల్యేలు, వారి పక్కనే ఉండే చోటా నేతలు చెప్పిందే చేస్తామనే ధోరణిలో పోలీసులు వ్యవహరిస్తుంటే ప్రజాస్వామ్యం బతికేవుందా అనే అనుమానాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో పది సీట్లు ఇచ్చి మంచిగా పరిపాలించండయ్యా అంటే దొంగ కేసులు పెట్టడంతో పాటు దౌర్జన్యాలు, అరాచకాలు, ఆస్తుల విధ్వంసాలు చేస్తున్నారని విమర్శించారు.
టీడీపీ కార్యకర్తలను ఇళ్లకు వెళ్లి కొడుతూ తిరిగి బాధితులపైనే కేసులు పెడుతూ హింసిస్తున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్సీ బీదా రవి చంద్ర మాట్లాడుతూ తమ నేతలపై అట్రాసిటీ కేసులు పెడుతూ చిన్న చిన్న కుటుంబాలను సైతం వేధిస్తున్నారన్నారు.. వైకాపా నేతల తీరు మారకపోతే చూస్తూ ఊరుకోం..టీడీపీ శ్రేణుల ఓపికను పరీక్షించొద్దంటూ హెచ్చరించారు..

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

పుట్టినరోజు కేక్ కట్ చేయడంపై తన అభిప్రాయాలు వెల్లడించిన పవన్ కల్యాణ్

 జనసేన పార్టీ అధ్యక్షుడు, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదినోత్సవం (సెప్టెంబరు 2) సందర్భంగా ఆయన అభిమానుల్లో కోలాహలం నెలకొంది. ఆయన మాత్రం ఎప్పటిలాగానే ఎంతో కూల్ గా కనిపించారు. తన బర్త్ డే సందర్భంగా పెద్దగా ఎప్పుడూ కేకులు కట్ చేయని పవన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించారు. చిన్నప్పటి నుంచి తనకు బర్త్ డే వేడుకలపై ఆసక్తి తక్కువని తెలిపారు. ఒకట్రెండు సార్లు స్కూల్లో చాక్లెట్లు పంచానని, కొన్ని సందర్భాల్లో తన కుటుంబ సభ్యులు కూడా తన పుట్టినరోజు సంగతి మర్చిపోయేవారని వెల్లడించారు. ఎప్పుడైనా తన పుట్టినరోజు సంగతి గుర్తొస్తే వదిన డబ్బులు ఇచ్చేవారని, ఆ డబ్బులతో పుస్తకాలు కొనుక్కోవడం తప్ప ప్రత్యేకమైన వేడుకలు తక్కువేనని పవన్ వివరించారు. "ఇక సినీ రంగంలోకి వచ్చిన తర్వాత నా పుట్టినరోజు వేడుకలను ఫ్రెండ్స్, నిర్మాతలు చేస్తుంటే ఇబ్బందికరంగా అనిపించేది. కేకు కోయడం, ఆ కేకు ముక్కలను నోట్లో పెట్టడం అంతా ఎబ్బెట్టుగా అనిపించేది. అందుకే జన్మదిన వేడుకలంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు... దీనికి వేరే కారణాలేవీ లేవు" అని పవన్ తెలిపారు.