ఏపీ విపక్షనేత చంద్రబాబునాయుడు రాష్ట్ర పోలీసులకు, అధికారులకు విస్పష్టమైన హెచ్చరికలు చేశారు. పోలీసులు, అధికారులు అతిగా ప్రవర్తించవద్దని, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదని గమనించాలని హితవు పలికారు. గతంలో అనేకమంది అధికారులు జైలుకు వెళ్లారని, అధికారులు తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. శాంతిభద్రతల కోసం గతంలో తమ పార్టీ నేతలనే జైలుకు పంపానని చంద్రబాబు వెల్లడించారు. పోలీసులు, అధికారులు చట్టప్రకారమే ముందుకు వెళ్లాలని అన్నారు. ఈ ముఖ్యమంత్రి శాశ్వతం కాదని పోలీసులు గుర్తించాలని హితవు పలికారు.
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Comments
Post a Comment