ఏపీ విపక్షనేత చంద్రబాబునాయుడు రాష్ట్ర పోలీసులకు, అధికారులకు విస్పష్టమైన హెచ్చరికలు చేశారు. పోలీసులు, అధికారులు అతిగా ప్రవర్తించవద్దని, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదని గమనించాలని హితవు పలికారు. గతంలో అనేకమంది అధికారులు జైలుకు వెళ్లారని, అధికారులు తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. శాంతిభద్రతల కోసం గతంలో తమ పార్టీ నేతలనే జైలుకు పంపానని చంద్రబాబు వెల్లడించారు. పోలీసులు, అధికారులు చట్టప్రకారమే ముందుకు వెళ్లాలని అన్నారు. ఈ ముఖ్యమంత్రి శాశ్వతం కాదని పోలీసులు గుర్తించాలని హితవు పలికారు.
కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్ పిటిషన్లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.
Comments
Post a Comment